త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Protest | 19 వేల పోస్టుల‌తో నోటిఫికేష‌న్ ఇవ్వండి.. ఇందిరాపార్క్ చౌర‌స్తాలో ఉద్యోగార్థుల ధ‌ర్నా

Protest | పోలీసు శాఖలో 7 వేల‌కుపైగా ఖాళీల‌తో ఇటీవ‌ల విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్ల‌పై (Police Notification) ఉద్యోగార్థులు ఆగ్ర‌హం వ్య‌క్తం (Protest) చేస్తున్నారు. ఖాళీగా ఉన్న‌ 19 వేల పోస్టుల‌తో మ‌రో నోటిఫికేష‌న్ విడుద‌ల చేయాలంటూ హైద‌రాబాద్‌ ఇందిరాపార్క్ చౌర‌స్తాలో (Indira Park) ధ‌ర్నాకు దిగారు.

G

Hyderabad | Published On Aug 3, 2026, 12.23 pm IST

Protest | 19 వేల పోస్టుల‌తో నోటిఫికేష‌న్ ఇవ్వండి.. ఇందిరాపార్క్ చౌర‌స్తాలో ఉద్యోగార్థుల ధ‌ర్నా
Advertisement

Protest | త్రినేత్ర‌.న్యూస్‌: పోలీసు శాఖలో 7 వేల‌కుపైగా ఖాళీల‌తో ఇటీవ‌ల విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్ల‌పై (Police Notification) ఉద్యోగార్థులు ఆగ్ర‌హం వ్య‌క్తం (Protest) చేస్తున్నారు. ఖాళీగా ఉన్న‌ 19 వేల పోస్టుల‌తో మ‌రో నోటిఫికేష‌న్ విడుద‌ల చేయాలంటూ హైద‌రాబాద్‌ ఇందిరాపార్క్ చౌర‌స్తాలో (Indira Park) ధ‌ర్నాకు దిగారు. ప్ల‌కార్డులు చేత‌ప‌ట్టుకుని ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు. పోలీస్ ఉద్యోగాల వ‌యోప‌రిమితి పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

నోటిఫికేష‌న్ ఆల‌స్యంతో వేలాది మంది అభ్య‌ర్థులు వ‌యోప‌రిమితి దాటిపోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కానిస్టేబుల్ పోస్టుల‌కు గ‌రిష్ట వ‌యోప‌రిమితి 36 ఏండ్లు, ఎస్సై పోస్టుల‌కు 38 ఏండ్ల‌కు పెంచాల‌ని కోరుతున్నారు. అదేవిధంగా ద‌ర‌ఖాస్తు రుసుమును వెంట‌నే త‌గ్గించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించాల‌ని, త‌మ డిమాండ్ల‌ను నిర‌వేర్చ‌క‌పోతే ఉద్య‌మాన్ని మ‌రింత ఉధృతం చేస్తామ‌ని హెచ్చ‌రిస్తున్నారు.

Advertisement
Advertisement