త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Yadadri Power Plant | యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద భూనిర్వాసితుల ఆందోళన.. వీర్లపాలెంలో ఉద్రిక్తత

Yadadri Power Plant | న‌ల్ల‌గొండ జిల్లా దామ‌ర‌చ‌ర్ల మండ‌లంలోని వీర్ల‌పాలెంలో ఉద్రిక్త‌త నెల‌కొంది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (Yadadri Power Plant) వద్ద భూనిర్వాసితులకు ఆందోళనకు దిగారు.

G

Telangana | Published On Aug 3, 2026, 12.39 pm IST

Yadadri Power Plant | యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద భూనిర్వాసితుల ఆందోళన.. వీర్లపాలెంలో ఉద్రిక్తత
Advertisement

Yadadri Power Plant | త్రినేత్ర‌.న్యూస్‌: న‌ల్ల‌గొండ జిల్లా దామ‌ర‌చ‌ర్ల మండ‌లంలోని వీర్ల‌పాలెంలో ఉద్రిక్త‌త నెల‌కొంది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (Yadadri Power Plant) వద్ద భూనిర్వాసితులకు ఆందోళనకు దిగారు. తమ డిమాండ్ల‌ను పరిష్కరించాలంటూ ప్లాంట్ ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద బైఠాయించారు. భూములు న‌ష్ట‌పోయిన‌వారికి శాశ్వ‌త ఉద్యోగాలు క‌ల్పించాల‌న్నారు. త‌మ‌కు త‌గిన ప‌రిహారం చెల్లించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

క‌లెక్ట‌ర్ వెంట‌నే రావాల‌ని ప‌ట్టుప‌డుతున్నారు. స‌మాచారం అందుకున్న పోలీసులు పెద్ద సంఖ్య‌లో అక్క‌డికి చేరుకున్నారు. ఆందోళ‌న‌కారుల‌ను శాంతిప‌జేసేందుకు ప్ర‌య‌త్నించారు. త‌మ‌కు స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చేంద‌ర‌కు వెన‌క్కి త‌గ్గేది లేద‌ని తేల్చిచెప్ప‌డంతో.. కాసేపు అక్క‌డ ఉద్రిక్త‌త నెల‌కొన్న‌ది. త‌మ డిమాండ్ల‌ను నెర‌వేర్చే వ‌ర‌కు ఆందోళ‌న కొన‌సాగిస్తామ‌ని బాధితులు హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement