త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gangula Kamalakar | నీళ్లిడ‌వ‌కుంటే మ‌ళ్లీ చ‌లో క‌న్నేప‌ల్లి: మాజీ మంత్రి గంగుల క‌మలాక‌ర్‌

Gangula Kamalakar | క‌న్నేప‌ల్లి, ఎల్లంప‌ల్లి నుంచి నీళ్ల‌ను ఎత్తిపోయ‌కుంటే మ‌ళ్లీ చ‌లో క‌న్నేప‌ల్లి, ఎల్లంప‌ల్లికి పిలుపునిస్తామ‌ని మాజీ మంత్రి గంగుల కమలాకర్ హెచ్చ‌రించారు. మంత్రి ఉత్తమ్‌కు ఏ మాత్రం అవగాహన లేదన్నారు. అన్నారం, సుందిళ్లలో నీరు నిల్వ చేయవద్దని ఎన్డీఎస్ఏ చెప్పలేదన్నారు.

S

Telangana | Published On Jul 6, 2026, 3.49 pm IST

Gangula Kamalakar | నీళ్లిడ‌వ‌కుంటే మ‌ళ్లీ చ‌లో క‌న్నేప‌ల్లి: మాజీ మంత్రి గంగుల క‌మలాక‌ర్‌
Advertisement

Gangula Kamalakar | త్రినేత్ర‌.న్యూస్‌: క‌న్నేప‌ల్లి, ఎల్లంప‌ల్లి నుంచి నీళ్ల‌ను ఎత్తిపోయ‌కుంటే మ‌ళ్లీ చ‌లో క‌న్నేప‌ల్లి, ఎల్లంప‌ల్లికి పిలుపునిస్తామ‌ని మాజీ మంత్రి గంగుల కమలాకర్ హెచ్చ‌రించారు. మంత్రి ఉత్తమ్‌కు ఏ మాత్రం అవగాహన లేదన్నారు. అన్నారం, సుందిళ్లలో నీరు నిల్వ చేయవద్దని ఎన్డీఎస్ఏ చెప్పలేదన్నారు. చిన్ని చిన్న అంశాలు ఉంటే మ‌ర‌మ్మ‌తులు చేయాల‌ని సూచించింద‌ని గుర్తు చేశారు. సోమ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో గంగుల మీడియాతో మాట్లాడుతూ రేవంత్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు.

కన్నేపల్లి, ఎల్లంపల్లి నుంచి నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదు. నీటిని ఎత్తిపోయకపోతే పంప్‌హౌస్‌ల వ‌ద్ద‌కు మళ్లీ వెళ్తాం. అన్నారం, సుందిళ్లలో నీరు నిల్వ చేయవద్దని ఎన్డీఎస్ఏ చెప్పలేదు. ఏవైనా మరమ్మతులు ఉంటే చేయాలని మాత్ర‌మే చెప్పింది. భయపడి జలాశయాలు నింపకుండా ఉంటారా? అని మాజీ మంత్రి గంగుల ఫైర‌య్యారు.

నీళ్లు ఇడిసేదాకా వ‌ద‌లం..

ఎల్లంప‌ల్లికి ఏం మ‌ర‌మ్మ‌తులు లేవు క‌దా. ఎల్లంప‌ల్లి నుంచి మేడారం, అక్క‌డి నుంచి ల‌క్ష్మిపురం అక్క‌డి నుంచి మిడ్‌మానేరు నింపాలి. క‌నీసం రెండు మూడు టీఎంసీల‌న్నా విడుద‌ల చేయండి. ఇప్ప‌టి వ‌ర‌కు వంద‌ల గ్రామాల్లో నారు పోయ‌లే. నారు పోయాలంటే నీళ్లొస్త‌య‌నే న‌మ్మ‌కం క‌ల్పించాలే. ఒకసారి ప‌ర్య‌టించండి. నీళ్లు ఇడుస్త‌మ‌ని ఒక ప్ర‌క‌ట‌న చేయండి. అప్ప‌టి దాకా మిమ్మ‌ల్ని వ‌ద‌లం. లేదంటే మ‌ళ్లీ పాద‌యాత్ర చేస్తం.

Advertisement
Advertisement