త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Singireddy Niranjan Reddy | ధృతరాష్ట్ర ప్రభుత్వానికి రైతుల గోసలు కనిపించడం లేదు: నిరంజ‌న్‌రెడ్డి

Singireddy Niranjan Reddy | రాష్ట్రం అధికారంలో ఉన్న ధృత‌రాష్ట్ర ప్ర‌భుత్వానికి రైతుల గోస‌లు క‌నిపించ‌డం లేద‌ని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

D

Hyderabad | Published On Jul 6, 2026, 5.03 pm IST

Singireddy Niranjan Reddy | ధృతరాష్ట్ర ప్రభుత్వానికి రైతుల గోసలు కనిపించడం లేదు: నిరంజ‌న్‌రెడ్డి
Advertisement

Singireddy Niranjan Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రం అధికారంలో ఉన్న ధృత‌రాష్ట్ర ప్ర‌భుత్వానికి రైతుల గోస‌లు క‌నిపించ‌డం లేద‌ని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కాడి పట్టాల్సిన రైతులు కాంగ్రెస్ పుణ్యాన సెల్ ఫోన్ పట్టి యూరియా బుకింగ్ కోసం ఎదురు చూస్తున్నారని వాపోయారు. పొలాల్లో ఉండాల్సిన రైతులు ఎరువుల బుకింగ్ కోసం ఎదురుచూడాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. యాప్ ద్వారా యూరియా దొరక్క రైతులు ఆపసోపాలు పడుతున్నారని చెప్పారు. యూరియా సరఫరా చేయడం చేతకాక యాప్ తీసుకువచ్చి ఏదో సాధించినట్లు ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. యాప్ ద్వారా ఎరువుల పంపిణీలో అక్రమాలు, బ్లాక్ మార్కెటింగ్‌కు చెక్ పెట్టామని చెప్పడం సర్కారు చేతగానితనానికి నిదర్శనమ‌ని ఎద్దేవా చేశారు.

యూరియా బ్లాక్ మార్కెట్‌కు తరలుతుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తోందని ప్ర‌శ్నించారు. సాగునీరు, కరెంటు, ఎరువులు సకాలంలో రైతులకు అందకుండా సాగు విస్తీర్ణం తగ్గేందుకు సర్కారు కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. సాగు తగ్గితే పంటల దిగుబడి తగ్గుతుందని, తద్వారా పంటల కొనుగోళ్ల నుంచి ప్రభుత్వం తప్పించుకుంటోంద‌ని మండిప‌డ్డారు. కేసీఆర్ పాలనలో రాజులా బతికిన రైతు కాంగ్రెస్ పాలనలో పంటల కొనుగోళ్ల కోసం అధికారుల కాళ్లు పట్టుకునే దుస్థితి వచ్చిందన్నారు. యూరియా బుకింగ్ కోసం యాప్ విధానం ఎత్తేయాలని రైతులు ఆందోళనలు చేస్తున్నారని గుర్తు చేశారు. కానీ యాప్ విజయవంతం అని ప్రభుత్వం ప్రకటించుకోవడం దుర్మార్గమ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. యాప్‌ను ఎత్తేసి రైతులకు యూరియా నిల్వలు అందుబాటులో ఉంచాలని, పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

Also Read..

కాళేశ్వ‌రం విష‌యంలో బీఆర్ఎస్‌, కాంగ్రెస్ రెండూ నాట‌కాలు వేస్తున్నాయి: రాంచంద‌ర్‌రావు

ఇప్ప‌టికి రైతు ఖాతాల్లో రూ.7490.72 కోట్లు జ‌మ‌

ఇంధన భద్రతే లక్ష్యం.. అమెరికా నుంచి ఎల్‌పీజీ దిగుమతులను పెంచే యోచనలో భారత్..!

Advertisement
Advertisement