Rythu Bharosa | కొత్త వారికీ రైతుభరోసా.. ప్రారంభమైన దరఖాస్తులు.. ఏయే పత్రాలు ఉండాలంటే?
Rythu Bharosa | యాసంగి సీజన్ పంట పెట్టుబడి సాయం అందించేందు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. మార్చి 22న సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) రైతు భరోసా (Rythu Bharosa) నిధులను అన్నదాతలకు విడుదల చేయనున్నారు.
Rythu Bharosa | త్రినేత్ర.న్యూస్: యాసంగి సీజన్ పంట పెట్టుబడి సాయం అందించేందు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. మార్చి 22న సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) రైతు భరోసా (Rythu Bharosa) నిధులను అన్నదాతలకు విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో రైతు భరోసా పథకంలో కొత్త రైతుల నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇప్పటివరకు పంటపెట్టుబడి సాయం పొందని రైతుల నమోదు ప్రక్రియను (New Registrations) మార్చి 25 వరకు చేపట్టనున్నారు. అయితే ఫిబ్రవరి 28 నాటికి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ అయిన రైతులకు మాత్రమే అవకాశం కల్పించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పోర్టల్ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. రైతులు తమ పట్టాదారు పాసుపుక్తం, ఆధార్ కార్డు, బ్యాంకు వివరాలను అప్లికేషన్ ఫారంలో నింపి రైతువేదికల్లో ఏఈవోలకు లేదా మండలాల్లోని వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాలి.
ఏయే పత్రాలు కావాలి..?
- పట్టాదారు పాస్ పుస్తకం
- రైతు ఆధార్ కార్డు
- బ్యాంకు అకౌంట్ పాస్ పుస్తకం
మూడు విడుతల్లో..
యాసంగి సీజన్ రైతుభరోసా నిధులను మూడు విడుతల్లో విడుదల చేయనున్నారు. మొదటి విడతగా ఈ నెల 22వ తేదీన సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి 70 లక్షల మంది రైతులకు ఎకరం వరకు రూ.3,590 కోట్లు నిధులను రైతుల ఖాతాల్లోకి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బదిలీ చేయనున్నారు.
తర్వాత మరో 20 రోజులకు రూ.2,650 కోట్లు రెండో విడతలో, ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడతగా రూ.2,760 నిధులు రైతు భరోసా పంట పెట్టుబడి సాయాన్ని వారి ఖాతాల్లోకి బదిలీ చేయనున్నారు. మొత్తంగా ఎకరానికి రూ.6 వేల చొప్పున 1.50 కోట్ల ఎకరాలకు రూ.9 వేల కోట్లు రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ కానున్నాయి.
కాగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు మూడు విడుతల్లో రైతుభరోసా అందించింది. ప్రస్తుతం నాలుగో సీజన్కు నిధులు అందుతున్నాయి. 2023-24 యాసంగిలో ఎకరానికి రూ.5000 చొప్పున 7625 కోట్లు, 2024-25 యాసంగిలో రూ.5000 చొప్పున రూ.5057 కోట్లు, 2025-26 వానాకాలం సీజన్లో ఎకరానికి సాయం రూ.6000కి పెంచి రూ.8800 కోట్లను జమ చేసింది.
ఇవికూడా చదవండి..
మార్కెట్ అవసరాలకు అనుగుణంగా.. డిగ్రీ, పీజీలో కొత్త కోర్సులు..
అప్పుడే జట్టులో చోటు లేదని తెలిసిపోయింది.. టెస్టు రిటైర్మెంట్పై అశ్విన్ కీలక కామెంట్స్..!
చావే అతనికి విముక్తి.. హరీష్ రాణా కన్నీటి కథ ఇది
మార్చి 18 రాశిఫలాలు.. ఈ రాశివారికి ఊహించని మార్గాల్లో లాభాలు వచ్చే అవకాశం!
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



