త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raksha Bandhan | మూడు తరాల అపురూప రక్షా ‘బంధం’..

Raksha Bandhan | రాఖీ పౌర్ణమి సందర్భంగా మూడు తరాల అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధం నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం పల్లెపాడు గ్రామంలో అపురూప దృశ్యంగా కనిపించింది.

S

Telangana | Published On Aug 28, 2026, 10.11 pm IST

Raksha Bandhan | మూడు తరాల అపురూప రక్షా ‘బంధం’..
Advertisement

పల్లెపాడు వేదికగా కన్నుల పండుగగా రాఖీ వేడుక..

Raksha Bandhan | త్రినేత్ర‌.న్యూస్ : రాఖీ పౌర్ణమి సందర్భంగా మూడు తరాల అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధం నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం పల్లెపాడు గ్రామంలో అపురూప దృశ్యంగా కనిపించింది. వయసు పెరిగినా, తరాలు మారినా అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమానురాగాలు చెక్కుచెదరవని చాటిచెప్పేలా జరిగిన ఈ వేడుక అందరినీ ఆకట్టుకుంది.

నాగారం గ్రామ సర్పంచ్, 96 ఏళ్ల గుంటకండ్ల రామచంద్రారెడ్డికి ఆయన 98 ఏళ్ల అక్క అండమ్మ, చెల్లెలు వసంతమ్మ రాఖీ కట్టి తమ్ముడిపై అపారమైన ప్రేమను కురిపించారు. అనంతరం రామచంద్రారెడ్డి తన సోదరి కాళ్లకు నమస్కరించి ఆమె ఆశీర్వాదం తీసుకోవడం అందరినీ ఆకట్టుకుంది. వయసు పెరిగినా ఆత్మీయతకు వయసు లేదని చాటిచెప్పిన ఈ దృశ్యం పలువురి హృదయాలను హత్తుకుంది.

అదే కుటుంబంలో మరో తరం అనుబంధం కూడా రాఖీ పండుగ సందర్భంగా మరింత అందంగా కనిపించింది. సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డికి ఆయన సోదరీమణులు భారతమ్మ, రేణుక రాఖీ కట్టి ఆశీర్వదించారు. ఇక మూడో తరంలో గుంటకండ్ల జగదీష్ రెడ్డి తనయుడు వేమన్ రెడ్డికి ఆయన సోదరీమణులు భావన, లహరిలు రాఖీ కట్టి అన్నాచెల్లెళ్ల ప్రేమను చాటుకున్నారు.

ఇలా ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల రాఖీ బంధం పల్లెపాడు వేదికగా, చూసినవారికి కన్నుల పండుగగా నిలిచింది. కాలం మారినా,తరాలు మారినా అన్నాచెల్లెళ్ల అనుబంధం మాత్రం తరగదని చాటిచెప్పిన ఈ అపురూప ఘట్టం రాఖీ పండుగకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.

Advertisement
Advertisement