త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Niloufer Hospital | నిలోఫ‌ర్‌కు పోటెత్తిన రోగులు.. రోజుకు కొత్త‌గా 100 మంది చేరిక‌

Niloufer Hospital | మారిన వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల కార‌ణంగా నిలోఫ‌ర్ హాస్పిట‌ల్‌కు రోగులు పోటెత్తుతున్నారు. అధిక జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబు, త‌ల‌నొప్పితో బాధ‌ప‌డుతున్న చిన్నారులు చేరుతున్న‌ట్లు ఆస్ప‌త్రి సిబ్బంది పేర్కొన్నారు.

S

Hyderabad | Published On Aug 28, 2026, 9.49 pm IST

Niloufer Hospital | నిలోఫ‌ర్‌కు పోటెత్తిన రోగులు.. రోజుకు కొత్త‌గా 100 మంది చేరిక‌
Advertisement

Niloufer Hospital | త్రినేత్ర‌.న్యూస్ : మారిన వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల కార‌ణంగా నిలోఫ‌ర్ హాస్పిట‌ల్‌కు రోగులు పోటెత్తుతున్నారు. అధిక జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబు, త‌ల‌నొప్పితో బాధ‌ప‌డుతున్న చిన్నారులు చేరుతున్న‌ట్లు ఆస్ప‌త్రి సిబ్బంది పేర్కొన్నారు. రోజుకు 100 మంది చొప్పున కొత్త‌గా రోగులు చేరుతున్నార‌ని తెలిపారు. సీజ‌న‌ల్ వ్యాధుల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య‌నే అధికంగా ఉంద‌న్నారు. చాలా మంది పిల్ల‌లు న్యూమోనియాతో బాధ‌ప‌డుతున్నార‌ని వెల్ల‌డించారు.

పిల్ల‌ల‌కు జ్వ‌రం వ‌స్తే త‌ల్లిదండ్రులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. సొంతంగా వైద్యం చేయ‌కుండా.. స‌మీప ఆస్ప‌త్రికి తీసుకెళ్లాల‌ని సూచించారు. చిన్నారుల‌ను వీలైనంత వ‌ర‌కు ప‌రిశుభ్రంగా ఉంచాల‌న్నారు. త‌రుచుగా చేతులు శుభ్రం చేసుకోవాల‌న్నారు. అనారోగ్యంతో ఉన్న పిల్ల‌ల‌ను పాఠ‌శాల‌ల‌కు పంప‌క‌పోవ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని వైద్యులు సూచించారు. బ‌హిరంగ ప్ర‌దేశాలు మాస్కులు ధ‌రించ‌డం ఉత్త‌మ‌మ‌ని పేర్కొన్నారు.

Advertisement
Advertisement