త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SCR | టికెట్ లేకుండా 13 వేల మంది ప్ర‌యాణం.. రూ. 1.28 కోట్ల జ‌రిమానా

SCR | టికెట్ లేకుండా రైలు ప్ర‌యాణం చేస్తున్న ప్ర‌యాణికుల ప‌ట్ల ద‌క్షిణ మ‌ధ్య రైల్వే దృష్టి సారించింది. ఈ క్ర‌మంలో ఈ నెల 24 నుంచి 26 వ‌ర‌కు మూడు రోజుల పాటు ముమ్మ‌రంగా టికెట్ త‌నిఖీలు నిర్వ‌హించారు.

S

National | Published On Aug 28, 2026, 8.24 pm IST

SCR | టికెట్ లేకుండా 13 వేల మంది ప్ర‌యాణం.. రూ. 1.28 కోట్ల జ‌రిమానా
Advertisement

SCR | త్రినేత్ర‌.న్యూస్ : టికెట్ లేకుండా రైలు ప్ర‌యాణం చేస్తున్న ప్ర‌యాణికుల ప‌ట్ల ద‌క్షిణ మ‌ధ్య రైల్వే దృష్టి సారించింది. ఈ క్ర‌మంలో ఈ నెల 24 నుంచి 26 వ‌ర‌కు మూడు రోజుల పాటు ముమ్మ‌రంగా టికెట్ త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ త‌నిఖీలు సౌత్ సెంట్ర‌ల్ రైల్వే వ్యాప్తంగా జ‌రిగాయి. కేవ‌లం టికెట్ లేకుండా ప్ర‌యాణించిన వారికే మాత్రం కాకుండా.. బుక్ చేయ‌ని ల‌గేజీని తీసుకెళ్లే వారిని కూడా గుర్తించి జ‌రిమానాలు విధించిన‌ట్లు పేర్కొన్నారు.

13,964 మంది ప్ర‌యాణికులు టికెట్ లేకుండా ప్ర‌యాణించినందుకు గానూ రూ. 1.28 కోట్ల జ‌రిమానాలు విధించారు. 1,189 మంది ప్ర‌యాణికులు బుక్ చేయ‌కుండా ల‌గేజీ తీసుకెళ్లినందుకు జ‌రిమానా విధించారు. రైల్వే ప్రాంగ‌ణాల‌ను అప‌రిశుభ్రం చేసినందుకు గానూ 37 మందిని గుర్తించి రూ. 6400, గుర్తింపు పొంద‌ని ఐదుగురు విక్ర‌య‌దారుల‌ను గుర్తించి రూ. 10 వేలు, రైల్లో స్మోకింగ్ చేసినందుకు ఏడుగురికి రూ. 14 వేలు జ‌రిమానా విధించారు.

Advertisement
Advertisement