త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Sanjay | తెలంగాణ బీజేపీలో ట్విస్ట్‌.. కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు

Bandi Sanjay | మూడోసారి ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత పీఎం మోదీ మోదీ తొలిసారి తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌నున్న వేళ.. రాష్ట్ర బీజేపీలో పెను సంచ‌ల‌నం చోటుచేసుకున్న‌ది. ఏకంగా కేంద్ర హోంశాఖ స‌హాయ‌ మంత్రి బండి సంజ‌య్ (Bandi Sanjay) కుమారుడిపై పోక్సో కేసు (POCSO Case) న‌మోద‌యింది.

G

Telangana | Published On May 9, 2026, 9.30 am IST

Bandi Sanjay | తెలంగాణ బీజేపీలో ట్విస్ట్‌.. కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు
Advertisement

Bandi Sanjay | త్రినేత్ర‌.న్యూస్‌: మూడోసారి ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత పీఎం మోదీ మోదీ తొలిసారి తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌నున్న వేళ.. రాష్ట్ర బీజేపీలో పెను సంచ‌ల‌నం చోటుచేసుకున్న‌ది. ఏకంగా కేంద్ర హోంశాఖ స‌హాయ‌ మంత్రి బండి సంజ‌య్ (Bandi Sanjay) కుమారుడిపై పోక్సో కేసు (POCSO Case) న‌మోద‌యింది. 17 ఏండ్ల‌ బాలికకు బ‌ల‌వంతంగా ఆల్క‌హాల్ తాగించి లైంగిక‌దాడి చేసినందుకుగాను అత‌నిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌజ్‌తో పాటు మరో రెండు ప్రాంతాల్లో జరిగినట్టు బాధితురాలిపై లైంగిక‌దాడి జ‌రిగిన‌ట్లు సమాచారం. దీంతో రెండు సార్లు ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది.

దీంతో శుక్ర‌వారం రాత్రి బాధితురాలి త‌ల్లిదండ్రులు పేట్ బ‌షీరాబాద్ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. అయితే కేసు న‌మోదు విశ‌యమై అర్ధరాత్రి 6 గంటలపాటు పోలీస్‌స్టేష‌న్‌లో హైడ్రామా న‌డిచింది. చివ‌ర‌కు ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా న‌మోదుచేశారు. కాగా, ఎఫ్ఐఆర్‌ కాకుండా బండి సంజయ్ విశ్వప్రయత్నం చేసిన‌ట్లు తెలుస్తున్న‌ది. కేసు వ్య‌వ‌హారం సీఎం రేవంత్, డీజీపీ సీవీ ఆనంద్ వ‌ద్ద‌కు కూడా చేరిన‌ట్లు స‌మాచారం.

కాగా, కేసు పెట్టకపోతే కోర్టుకు వెళ్తామని బాధితురాలి తల్లితండ్రులు స్ప‌ష్టం చేస్తున్నారు. కేంద్ర మంత్రి కొడుకైతే పోక్సో కేసు పెట్టరా అని ప్ర‌శ్నిస్తున్నారు. తొలుత ఎఫ్ఐఆర్ న‌మోదుచేయ‌క‌పోవ‌డంతో పోలీసుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గతంలో ఉత్తరప్రదేశ్‌లో కూడా బండి సంజయ్ కొడుకుపై కేసులు నమోదైనట్టు ఆరోపణలు ఉన్నాయి.

Advertisement
Advertisement