త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Khammam | అమ్మ తీసుకుర‌మ్మంద‌ని చెప్పి.. ఇంట‌ర్ అమ్మాయిని కిడ్నాప్ చేశారు..

Khammam | మైనార్టీ గురుకుల (Minority Gurukulam) కాలేజీలో ఓ అమ్మాయి ఇంట‌ర్ చ‌దువుతున్న‌ది. త‌న స్నేహితుల‌తో క‌లిసి ఆ కాలేజీ వ‌ద్ద‌కు వెళ్లిన వ‌యువ‌కుడు.. త‌న అమ్మ బాలిక‌ను తీసుకురమ్మ‌ని చెప్పింద‌ని సిబ్బందికి చెప్పాడు.

G

Telangana | Published On Jul 6, 2026, 12.16 pm IST

Khammam | అమ్మ తీసుకుర‌మ్మంద‌ని చెప్పి.. ఇంట‌ర్ అమ్మాయిని కిడ్నాప్ చేశారు..
Advertisement

Khammam | త్రినేత్ర‌.న్యూస్‌: మైనార్టీ గురుకుల (Minority Gurukulam) కాలేజీలో ఓ అమ్మాయి ఇంట‌ర్ చ‌దువుతున్న‌ది. త‌న స్నేహితుల‌తో క‌లిసి ఆ కాలేజీ వ‌ద్ద‌కు వెళ్లిన వ‌యువ‌కుడు.. త‌న అమ్మ బాలిక‌ను తీసుకురమ్మ‌ని చెప్పింద‌ని సిబ్బందికి చెప్పాడు. దీంతో నిజ‌మేన‌ని న‌మ్మిన సిబ్బంది ఆమెను తీసుకెళ్లేందుకు అనుమ‌తించారు. అయితే ఆమెను ఇంటికి కాకుండా మ‌రో చోటకు (Kidnap) తీసుకెళ్లారు. అస‌లు విష‌యం తెలియ‌డంతో కాలేజీ ప్రిన్సిప‌ల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘ‌ట‌న ఖ‌మ్మం (Khammam) జిల్లా కారేప‌ల్లిలో చోటుచేసుకున్న‌ది.

ఖ‌మ్మం ప‌ట్ట‌ణం టేకుల‌ప‌ల్లిలో నివాసముండే బాజీ అనే యువ‌కుడు మ ముగ్గిరితో క‌లిసి కారేప‌ల్లి మైనార్టీ కళాశాల‌కు వెళ్లాడు. అందులో ఇంట‌ర్ చ‌ద‌వుతున్న అమ్మాయిని.. త‌న త‌ల్లి తీసుకుర‌మ్మంద‌ని మాయ‌మాట‌లు చెప్పి బ‌య‌ట‌కు తీసుకెళ్లారు. విషయం తెలిసిన కాలేజీ ఇన్చార్జి ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. బాలికను తీసుకెళ్లిన నలుగురిని గుర్తించారు. బాజీకి సహకరించిన అతని అక్క అప్సర్, పిన్ని మున్ని, శ్రావణి మరో యువతిపై పోక్సో కేసు (POCSO case) నమోదు చేశారు.

Advertisement
Advertisement