త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Congress | అర్వపల్లిలో ఉద్రిక్త‌త‌.. రాళ్లు, క‌ర్ర‌లతో దాడులు చేసుకున్న ఎంపీ చామల, ఎమ్మెల్యే సామేలు వర్గీయులు..

Congress | సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ (Congress) పార్టీలో విభేదాలు ర‌చ్చ‌కెక్కాయి. తుంగ‌తుర్తి నియోజ‌క‌ర్గంలో కాంగ్రెస్ పార్టీ నేత‌ల మ‌ధ్య వ‌ర్గ‌పోరు తీవ్ర‌మైంది. సొంత‌పార్టీ నేత‌లే (Congress Supporters) ఒక‌రిపై ఒక‌రు క‌ర్ర‌లు, రాళ్ల‌తో దాడులు చేసుకున్నారు.

G

Telangana | Published On Jul 8, 2026, 12.45 pm IST

Congress | అర్వపల్లిలో ఉద్రిక్త‌త‌.. రాళ్లు, క‌ర్ర‌లతో దాడులు చేసుకున్న ఎంపీ చామల, ఎమ్మెల్యే సామేలు వర్గీయులు..
Advertisement

Congress | త్రినేత్ర‌.న్యూస్‌: సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ (Congress) పార్టీలో విభేదాలు ర‌చ్చ‌కెక్కాయి. తుంగ‌తుర్తి నియోజ‌క‌ర్గంలో కాంగ్రెస్ పార్టీ నేత‌ల మ‌ధ్య వ‌ర్గ‌పోరు తీవ్ర‌మైంది. సొంత‌పార్టీ నేత‌లే (Congress Supporters) ఒక‌రిపై ఒక‌రు క‌ర్ర‌లు, రాళ్ల‌తో దాడులు చేసుకున్నారు. అర్వపల్లి (Arvapally) మండల కేంద్రంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేలు వర్గాల కొట్టుకున్నాయి. తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థులు నెల‌కొన‌డంతో పోలీసులు లాఠీల‌కు ప‌నిచెప్పారు.

తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ మండల అధ్యక్ష ఎన్నికల్లో ఎమ్మెల్యే మందుల సామేలు (MLA Mandula Samuel) ఏకపక్షంగా చేపట్టారని ఎంపీ చామల కిర‌ణ్ కుమార్ రెడ్డి (MP Kiran Kumar Reddy) వర్గానికి చెందిన నాయకులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే ఏక‌ప‌క్ష వైఖ‌రికి నిర‌స‌న‌గా, ఆ ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్‌కు (Gandhi Bhavan) బయల్దేరారు. ఈ క్రమంలో అర్వపల్లి మండల కేంద్రంలో వారిని ఎమ్మెల్యే సామేలు అనుచరులు అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. ఒక‌రినొక‌రు తోసుకున్నారు.

అది మ‌రింత ముద‌ర‌డంతో ఇరుప‌క్షాలు రాళ్లు, క‌ర్ర‌ల‌తో ప‌ర‌స్ప‌రం దాడులు చేసుఉక‌న్నారు. దీంతో ప్ర‌ధాన ర‌హ‌దారిపై ఉద్రిక్త‌త చోటుచేసుకున్న‌ది. దాడులు ప్ర‌తిదాడుల్తో ప‌లు కార్లు ధ్వంస‌మ‌య్యాయి. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప‌రిస్థితి చేయిదాటిపోతుండ‌టంతో పోలీసులు త‌మ లాఠీల‌కు (Lathi Charge) ప‌నిచెప్పారు. రెండు వ‌ర్గాల‌ను చెద‌ర‌గొట్టి ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Advertisement
Advertisement