Congress | అర్వపల్లిలో ఉద్రిక్తత.. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్న ఎంపీ చామల, ఎమ్మెల్యే సామేలు వర్గీయులు..
Congress | సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ (Congress) పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. తుంగతుర్తి నియోజకర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య వర్గపోరు తీవ్రమైంది. సొంతపార్టీ నేతలే (Congress Supporters) ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు.
Congress | త్రినేత్ర.న్యూస్: సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ (Congress) పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. తుంగతుర్తి నియోజకర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య వర్గపోరు తీవ్రమైంది. సొంతపార్టీ నేతలే (Congress Supporters) ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. అర్వపల్లి (Arvapally) మండల కేంద్రంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేలు వర్గాల కొట్టుకున్నాయి. తీవ్ర ఉద్రిక్త పరిస్థులు నెలకొనడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు.
తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ మండల అధ్యక్ష ఎన్నికల్లో ఎమ్మెల్యే మందుల సామేలు (MLA Mandula Samuel) ఏకపక్షంగా చేపట్టారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Kiran Kumar Reddy) వర్గానికి చెందిన నాయకులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే ఏకపక్ష వైఖరికి నిరసనగా, ఆ ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్కు (Gandhi Bhavan) బయల్దేరారు. ఈ క్రమంలో అర్వపల్లి మండల కేంద్రంలో వారిని ఎమ్మెల్యే సామేలు అనుచరులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. ఒకరినొకరు తోసుకున్నారు.
సూర్యాపేట కాంగ్రెస్లో రచ్చ.. రాళ్లు, కర్రలతో పరస్పర దాడులు
తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్గపోరు
జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ
ఎమ్మెల్యే మందుల సామేల్ ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ ఛలో గాంధీభవన్కు ప్రత్యర్థి వర్గం
గాంధీభవన్కు వెళ్తున్న పాత… pic.twitter.com/Tc3MmeeqaP
— PulseNewsBreaking (@pulsenewsbreak) July 8, 2026
అది మరింత ముదరడంతో ఇరుపక్షాలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుఉకన్నారు. దీంతో ప్రధాన రహదారిపై ఉద్రిక్తత చోటుచేసుకున్నది. దాడులు ప్రతిదాడుల్తో పలు కార్లు ధ్వంసమయ్యాయి. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు తమ లాఠీలకు (Lathi Charge) పనిచెప్పారు. రెండు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రంలో ఉద్రిక్తత
కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి వర్గంపై కర్రలతో, రాళ్లతో దాడి చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ అనుచరులు
పలు వాహనాలు ధ్వంసం చేసిన ఇరు వర్గాల కాంగ్రెస్ నాయకులు
పలువురు… https://t.co/kGhLnaGYzm pic.twitter.com/EFoOlpfFzg
— Telugu Scribe (@TeluguScribe) July 8, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక
- ●Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!
- ●Power Demand | ఎల్నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ●Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి
- ●Damodar Rajanarasimha | ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి రాజనర్సింహ
- ●TTA Convention USA | అమెరికాలో టీటీఏ మహాసభల సందడి: తెలంగాణ అధికారులకు షార్లెట్లో ఆత్మీయ స్వాగతం

Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక

Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!

Power Demand | ఎల్నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి






