త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | సీనియర్ రిటైర్డ్ ఇంజనీర్లను బెల్టుతో కొడతామని రేవంత్ రెడ్డి బెదిరించారు

కృష్ణా, గోదావరి జలాల వినియోగం నుంచి కరెంట్ కోతల దాకా కాంగ్రెస్ వైఫల్యాలపై మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన లెక్కలు బయటపెట్టారు.

J

Telangana | Published On Sep 19, 2026, 6.23 pm IST

Harish Rao | సీనియర్ రిటైర్డ్ ఇంజనీర్లను బెల్టుతో కొడతామని రేవంత్ రెడ్డి బెదిరించారు

సంక్షిప్త సారాంశం

తెలంగాణలో ప్రస్తుత దుస్థితికి ప్రకృతి కారణం కాదని, పాలకుల అసమర్థత వల్లే రైతాంగానికి సాగునీరు అందడం లేదని మాజీ మంత్రి హరీశ్‌ రావు ధ్వజమెత్తారు. కృష్ణా జలాల వినియోగంలో చరిత్రలోనే అత్యంత తక్కువ రికార్డు నమోదైందని, శ్రీశైలం నీటి లెక్కలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపించారు. కాళేశ్వరం బ్యారేజీలు పటిష్టంగా ఉన్నాయని నివేదికలు స్పష్టం చేసినా, కేసీఆర్‌పై రాజకీయ కక్షతో నీళ్లను సముద్రం పాలు చేస్తున్నారని విమర్శించారు. కొడంగల్-నారాయణపేట ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.1,450 కోట్ల నుంచి రూ.6,825 కోట్లకు దాదాపు 5 రెట్లు ఎందుకు పెంచారో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement
  • ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ చేతకానితనమే
  • నీళ్ల లెక్కలు, కరెంట్ కోతలపై హరీశ్‌ రావు నిప్పులు

Harish Rao | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే టి. హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి ఎద్దడి, విద్యుత్ సంక్షోభం కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ చేతకానితనం తెచ్చిన కృత్రిమ కరువని స్పష్టం చేశారు. పాలనా వైఫల్యాలను ప్రకృతిపై, ఎల్‌నినోపై నెట్టి అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆయన మండిపడ్డారు.

Not Nature's Drought and It's Congress Failure Harish Rao Slams Revanth Govt

కృష్ణా జలాల్లో చెత్త రికార్డు.. శ్రీశైలం లెక్కలపై పచ్చి అబద్ధాలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణా జలాల వినియోగంలో చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు (Ever lowest utilization) కాంగ్రెస్ పాలనలోనే నమోదైందని హరీశ్ రావు విమర్శించారు. శ్రీశైలంలో 84 టీఎంసీల నీటిని వినియోగించుకున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో పచ్చి అబద్ధాలు చెప్పారని ఆరోపించారు.

Not Nature's Drought and It's Congress Failure Harish Rao Slams Revanth Govt

కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తోడింది కేవలం 8 టీఎంసీలు మాత్రమేనని గుర్తుచేసిన ఆయన, మిగతా నీటిని ఏ రిజర్వాయర్‌లో నింపారో, ఏ పంటలకు మళ్లించారో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు.

రాజకీయ కక్షతోనే కాళేశ్వరం నీళ్లు సముద్రం పాలు

అన్నారం, సుందిల్ల బ్యారేజీల కాంక్రీట్ నిర్మాణం 100 శాతం పటిష్టంగా ఉందని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ CWPRS తేల్చి చెప్పిందని హరీశ్ రావు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం నీటిని ఎత్తిపోసుకోవచ్చని ఎన్‌డీఎస్ఏ (NDSA) స్వయంగా హైకోర్టుకు నివేదించినా, కేసీఆర్‌పై ఉన్న రాజకీయ కక్షతోనే కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లను ఆన్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Not Nature's Drought and It's Congress Failure Harish Rao Slams Revanth Govt

మేడిగడ్డ వద్ద 46 వేల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వృథాగా వెళ్లిపోతున్నా, గేట్లు మూసి నీటిని నిల్వ చేసే సోయి ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు. రైతులకు మేలు చేసేలా నీళ్లు ఎత్తాలని సూచించిన సీనియర్ రిటైర్డ్ ఇంజనీర్లను బెల్టులతో కొడతామని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం అహంకారపూరిత చర్య అని హరీశ్ రావు మండిపడ్డారు. దేవాదులలో 10 మోటార్లకు కేవలం 4 మోటార్లు మాత్రమే నడిపారని, బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పోరాడితేనే మిగతా మోటార్లను ప్రారంభించారని తెలిపారు. అలాగే ఎల్లంపల్లికి 37 టీఎంసీల ప్రవాహం వస్తే, కేవలం 6 టీఎంసీలే ఎత్తి, మిగిలిన నీటిని కిందకు వదిలేసి అన్నదాతల పొట్ట కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

Not Nature's Drought and It's Congress Failure Harish Rao Slams Revanth Govt

బొగ్గు కొరత సాకుతో 3,300 మెగావాట్ల విద్యుత్ బంద్

కరోనా వంటి మహమ్మారి సంక్షోభ సమయంలోనూ కేసీఆర్ ప్రభుత్వం రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించిందని హరీశ్ రావు గుర్తుచేశారు. నేడు పూర్తి ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులో ఉన్నప్పటికీ, బొగ్గు కొరత అనే కుంటిసాకుతో యాదాద్రి, భద్రాద్రి, కొత్తగూడెం ప్లాంట్లలో దాదాపు 3,300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రభుత్వం నిలిపివేసి, గ్రామాల్లో అప్రకటిత కరెంట్ కోతలు విధిస్తోందని ఆరోపించారు.

Not Nature's Drought and It's Congress Failure Harish Rao Slams Revanth Govt

అసెంబ్లీలో ఈ వైఫల్యాలపై కాంగ్రెస్ గుట్టు రట్టవుతుందనే భయంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అక్రమంగా సస్పెండ్ చేశారని విమర్శించారు. కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకం అంచనా వ్యయాన్ని గతంలో ఉన్న రూ.1,450 కోట్ల నుంచి ఒక్కసారిగా రూ.6,825 కోట్లకు (దాదాపు 5 రెట్లు) ఎందుకు పెంచారో రేవంత్ రెడ్డి స్వయంగా సమాధానం చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

Not Nature's Drought and It's Congress Failure Harish Rao Slams Revanth Govt

Advertisement
Advertisement