త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NABARD Telangana | తెలంగాణ వ్యవసాయంలో భారీ మార్పులు: రైతుల ఆదాయం పెంచేందుకు నాబార్డ్ ‘క్లైమేట్ స్మార్ట్’ ప్లాన్!

వాతావరణ మార్పుల నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయ రంగాన్ని రక్షించేందుకు నాబార్డ్ (NABARD) కీలక అడుగులు వేస్తోంది. పంటల మార్పిడి, స్మార్ట్ ఫార్మింగ్‌పై ఫోకస్.

J

Telangana | Published On Jun 18, 2026, 7.14 pm IST

NABARD Telangana | తెలంగాణ వ్యవసాయంలో భారీ మార్పులు: రైతుల ఆదాయం పెంచేందుకు నాబార్డ్ ‘క్లైమేట్ స్మార్ట్’ ప్లాన్!
Advertisement
  • వాతావరణ మార్పుల నుంచి వ్యవసాయ రంగాన్ని రక్షించేందుకు పంటల మార్పిడి (Crop Diversification) అనివార్యమని నాబార్డ్ స్పష్టీకరణ
  • హైదరాబాద్‌లో జరిగిన నాబార్డ్ ప్రాంతీయ సలహా కమిటీ (RAC) సమావేశంలో క్లైమేట్ స్మార్ట్ వ్యవసాయంపై విస్తృత చర్చ
  • తెలంగాణలో 'రైస్-360', 'మా తోట', 'జీవా' వంటి వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు అధికారుల వెల్లడి
  • కూరగాయల సాగుకు కోతుల బెడద తప్పించేందుకు సోలార్ ఫెన్సింగ్, వ్యవసాయ యంత్రాలకు సబ్సిడీ ఇవ్వాలని కోదండరెడ్డి సూచన

NABARD Telangana | త్రినేత్ర.న్యూస్ : వాతావరణ మార్పుల (Climate Change) దెబ్బకు వ్యవసాయ రంగం కుదేలవుతున్న వేళ.. తెలంగాణ రైతాంగానికి అండగా నిలిచేందుకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (NABARD) కీలక వ్యూహాలను సిద్ధం చేసింది. హైదరాబాద్‌లో నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో గురువారం జరిగిన ప్రాంతీయ సలహా కమిటీ (RAC) సమావేశంలో 'క్లైమేట్ స్మార్ట్ వ్యవసాయం', 'పంటల మార్పిడి' (Crop Diversification) ద్వారా రైతుల ఆదాయాన్ని స్థిరంగా ఉంచే మార్గాలపై నిపుణులు లోతుగా చర్చించారు.

ఒకే పంటతో నష్టాలు.. మారాలి సాగు విధానాలు  

ఎంతసేపూ ఒకే పంట వేయడం (Monocropping), తీవ్రమవుతున్న నీటి కొరత, వాతావరణంలో ఆకస్మిక మార్పులు, మార్కెట్ అనిశ్చితి.. ఇవి ఇప్పుడు రైతులను వేధిస్తున్న ప్రధాన సమస్యలు. వీటికి చెక్ పెట్టాలంటే కేవలం వ్యవసాయంపైనే ఆధారపడకుండా పశుసంవర్థక, ఉద్యాన, మత్స్య రంగాలను కూడా సమ్మిళితం చేస్తూ బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆర్‌ఏసీ సమావేశంలో నిపుణులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా రైతులకు మెరుగైన మార్కెట్ (Market Linkage) కల్పించడం, విలువ ఆధారిత ఉత్పత్తుల సప్లై చైన్‌ను మెరుగుపరచడం ద్వారా రైతుల ఆర్థిక స్థితిగతులను మార్చవచ్చని నాబార్డ్ తెలంగాణ సీజీఎం బి. ఉదయ్ భాస్కర్ స్పష్టం చేశారు.

తెలంగాణలో నాబార్డ్ వినూత్న ప్రాజెక్టులు

వాతావరణ మార్పులను తట్టుకుని నిలబడేలా నాబార్డ్ తెలంగాణలో ఇప్పటికే పలు ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తోంది. ఈ కార్యక్రమాల గురించి ఉదయ్ భాస్కర్ వివరిస్తూ..

క్లైమేట్ స్మార్ట్ వరి సాగు: 'రైస్-360' (Rice-360) పేరుతో 450 ఎకరాల్లో పైలట్ ప్రాజెక్ట్ నడుస్తోంది.

ప్రకృతి వ్యవసాయం: 'జీవా' (JIVA) ప్రోగ్రామ్ ద్వారా సేంద్రీయ సాగుకు పూర్తి ప్రోత్సాహం అందిస్తున్నారు.

మా తోట: ఈ కార్యక్రమం కింద ఇప్పటికే 20 వేలకు పైగా పండ్ల తోటలను అభివృద్ధి చేశారు.

వీటితో పాటు సన్నకారు రైతుల కోసం తక్కువ ఖర్చుతో కూడిన షేడ్ నెట్ హౌస్‌లు (Shade nets), మైక్రో ఇరిగేషన్, వాటర్ షెడ్ల అభివృద్ధి, ఎఫ్‌పీఓ (FPOs) లకు మద్దతు కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

NABARD's Climate-Smart Agriculture Master Plan for Telangana Farmers

సోలార్ ఫెన్సింగ్‌కు సబ్సిడీ ఇవ్వాలి

ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైన తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి పలు కీలక సూచనలు చేశారు. పంటల మార్పిడిలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్‌గా నిలవాలన్న ఆయన.. సబ్సిడీల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

కూరగాయలు పండించే రైతులకు కోతుల బెడద ఎక్కువగా ఉన్నందున, సోలార్ ఫెన్సింగ్ (Solar Fencing) కు సబ్సిడీ ఇవ్వాలని కోరారు. వ్యవసాయ కూలీల కొరతను అధిగమించేందుకు కలుపు యంత్రాలు, చిన్న వ్యవసాయ యంత్రాలకు సబ్సిడీ ఇవ్వడంతో పాటు కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, సరఫరా బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. ఎఫ్‌పీఓలు, క్రాప్ కాలనీల (Crop Colonies) కాన్సెప్ట్‌ను విస్తృతంగా ప్రచారం చేసి, వర్షాధార పంటలైన నూనెగింజలు, పప్పుధాన్యాల సాగు పెంచితే రైతుల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement