త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DGP Anand | ఎంపీ గారు.. మీపై నిఘా కోసం ఎవ‌రినీ నియ‌మించ‌లే: డీజీపీ సీవీ ఆనంద్

DGP Anand | త‌న‌పై సీఎం రేవంత్ రెడ్డి త‌మ్ముడు పోలీసుల‌తో నిఘా పెట్టించార‌ని నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై డీజీపీ సీవీ ఆనంద్ మంగ‌ళ‌వారం స్పందించారు. ఎంపీ అర‌వింద్ చేసిన ఆరోప‌ణ‌ల్లో ఎలాంట‌గి నిజం లేదని తేల్చి చెప్పారు.

S

Telangana | Published On Aug 25, 2026, 12.58 pm IST

DGP Anand | ఎంపీ గారు.. మీపై నిఘా కోసం ఎవ‌రినీ నియ‌మించ‌లే: డీజీపీ సీవీ ఆనంద్
Advertisement

DGP Anand | త్రినేత్ర‌.న్యూస్‌: త‌న‌పై సీఎం రేవంత్ రెడ్డి త‌మ్ముడు పోలీసుల‌తో నిఘా పెట్టించార‌ని నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై డీజీపీ సీవీ ఆనంద్ మంగ‌ళ‌వారం స్పందించారు. ఎంపీ అర‌వింద్ చేసిన ఆరోప‌ణ‌ల్లో ఎలాంట‌గి నిజం లేదని తేల్చి చెప్పారు. ఎంపీ చేసిన ఆరోప‌ణ‌ల‌పై విచారించిన త‌ర్వాతే అవాస్త‌వ‌మ‌ని నిర్ధారించిన‌ట్లు డీజీపీ తెలిపారు.

'X' వేదికగా నిన్న‌ మీరు చేసిన ఆరోపణల నేపథ్యంలో సంబంధిత వర్గాల ద్వారా వాస్తవాలను నిర్ధారించుకోవడానికి పూర్తి వివరాలు తెలుసుకున్నాను. ఎంపీ గారు.. మిమ్మల్ని అనుసరించడానికి, లేదా మీ కదలికలపై నిఘా ఉంచడానికి ఏ అధికారిని కూడా నియమించలేదు. ఈ విష‌యాన్ని నేను మీకు స్ప‌ష్టం చేస్తున్నాను. అటువంటి విష‌యాల‌ను మేం నమ్మం, ఎట్టిప‌రిస్థితుల్లో అటువంటి ప‌నులు చేయం. అయినా మీ వద్ద ఏవైనా అదనపు వివరాలు ఉంటే దయచేసి వాటిని నాకు నేరుగా తెల‌పండి. వాటిని పూర్తిగా పరిశీలించి, వాస్తవాలను నిర్ధారిస్తాం అని డీజీపీ ఆనంద్ స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement