త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Polytechnic | పాలిటెక్నిక్ విద్యార్థులు నష్టపోకుండా ఉన్న‌త స్థాయి కమిటీ

Polytechnic | రాష్ట్రంలో పాలిటెక్నిక్ కాలేజీలు, విద్యార్థుల పాలిట శాపంగా మారిన జీవో 97 రద్దు చేయాలని బాధిత విద్యార్థులు, ఆయా విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు న‌ష్ట‌పోకుండా చ‌ర్య‌లు తీసుకునేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఉన్న‌త‌స్థాయి క‌మిటీని ఏర్పాటు చేసింది.

S

Telangana | Published On Aug 24, 2026, 10.33 pm IST

Polytechnic | పాలిటెక్నిక్ విద్యార్థులు నష్టపోకుండా ఉన్న‌త స్థాయి కమిటీ
Advertisement

Polytechnic | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో పాలిటెక్నిక్ కాలేజీలు, విద్యార్థుల పాలిట శాపంగా మారిన జీవో 97 రద్దు చేయాలని బాధిత విద్యార్థులు, ఆయా విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు న‌ష్ట‌పోకుండా చ‌ర్య‌లు తీసుకునేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఉన్న‌త‌స్థాయి క‌మిటీని ఏర్పాటు చేసింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ జాజూ అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేశారు.

పాలిటెక్నిక్ విద్యను ఆధునీకరించడానికి మరియు విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర భాగస్వాముల చట్టబద్ధమైన విద్యా, వృత్తిపరమైన ప్రయోజనాలను రక్షించడానికి ఈ క‌మిటీ ప‌ని చేయ‌నుంది. కమిటీ చైర్మన్ గా ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, సభ్యులుగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం.కోదండరాం, రిటైర్డ్ ప్రొఫెసర్ శాంతాసిన్హా, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, శక్తి శాఖ కార్యదర్శి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌లు ఉన్నారు. ఈ కమిటీ సంబంధిత వర్గాలన్నింటితో విస్తృతంగా చర్చించి, అన్ని అంశాలను నిశితంగా పరిశీలించి 30 రోజుల్లోగా ప్రభుత్వానికి తగిన సిఫార్సులు చేయాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement