త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chamala Kiran Kumar Reddy | ఆ ఆస్తులు మీ తాతలిచ్చినవేనా?

ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఎర్రవల్లి, జన్వాడ భూములపై అసెంబ్లీలో సీఎం రేవంత్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

J

Telangana | Published On Sep 17, 2026, 7.16 pm IST

Chamala Kiran Kumar Reddy | ఆ ఆస్తులు మీ తాతలిచ్చినవేనా?

సంక్షిప్త సారాంశం

తెలంగాణ వస్తే దళితుడిని సీఎం చేస్తానని, తమ కుటుంబానికి పదవులు వద్దని ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పిన మాటలను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గుర్తుచేశారు. ఉద్యోగాలు, పదవులన్నీ కేసీఆర్ కుటుంబానికే దక్కడం వల్లే తెలంగాణ యువత నిరుద్యోగంతో ఇబ్బందులు పడిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించిన ఎర్రవల్లి, జన్వాడ భూముల వివరాలపై కేటీఆర్ సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 1954 ఖాస్రా పహాణీ రికార్డుల్లో లేని తాతల ఆస్తులు ఇప్పుడు వందల ఎకరాలుగా ఎలా వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు.

Advertisement
  • కేటీఆర్‌కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూటి ప్రశ్నలు

Chamala Kiran Kumar Reddy | త్రినేత్ర.న్యూస్ : ఉద్యమ సమయంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని, తమ కుటుంబంలో ఎవరికీ రాజకీయ పదవులు అవసరం లేదని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ కుటుంబం.. అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుందని భువనగిరి ఎంపీ, టీపీసీసీ మీడియా చైర్మన్ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి లేవనెత్తిన భూ అక్రమాల వివరాలకు సమాధానం చెప్పలేక కేటీఆర్ ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు.

ఉద్యమ హామీలు ఏమయ్యాయి?

ఉద్యమ రోజుల్లో తాను కేవలం కాపలా కుక్క లాంటి వాడినని, తన కుమారుడు కేటీఆర్ అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నాడని, తమ కుటుంబానికి పదవులు వద్దని కేసీఆర్ చెప్పిన విషయాన్ని చామల గుర్తుచేశారు. "మరి అంత గొప్పగా చదువుకున్న కేటీఆర్ అమెరికా నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? రాష్ట్రంలో ఎవరికీ లేని పదవులు మీ కుటుంబానికే ఎలా వచ్చాయి? యువతకు రావాల్సిన ఉద్యోగాలను కుటుంబమే అనుభవించి, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారా?" అని నిలదీశారు.

ఆలీబాబా 40 దొంగల ముఠా

మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేసి, బీఆర్ఎస్ ముఖ్య నేతలు మాత్రం వేల కోట్ల ఆస్తులు కూడబెట్టారని చామల విమర్శించారు. నిన్న మొన్నటి వరకు సోడాలు, నీళ్లు కలిపే స్థాయి నేతలు కూడా వందల కోట్లకు అధిపతులు ఎలా అయ్యారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టిన భూముల లెక్కలపై స్పష్టత ఇవ్వకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం సిగ్గుచేటన్నారు.

1954 ఖాస్రా పహాణీలో మీ పేర్లు ఎక్కడ?

తమ ఆస్తులన్నీ తాతలు సంపాదించినవేనని చెప్పుకుంటున్న కేటీఆర్.. 1954 ఖాస్రా పహాణీ రికార్డుల్లో ఆ వివరాలు ఎందుకు లేవో సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. "జన్వాడలో, ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఉన్న వందల ఎకరాల భూమి ఏ ఊరి తాత ఇచ్చాడు? అది 295 ఎకరాలా లేక 700 ఎకరాలా అనేది బహిర్గతం చేయాలి" అని డిమాండ్ చేశారు. ప్రెస్ మీట్లలో వంకరటింకర మాటలు మాట్లాడటం మానుకుని, సీఎం అడిగిన సూటి ప్రశ్నలకు కేటీఆర్, ఆయన బావ హరీశ్ రావు సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement