త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chamala Kiran Kumar Reddy | సైబర్ బెదిరింపులను అరికట్టడంలో ఏఐ, సైబ‌ర్ సెక్యూరిటీ టెక్నాల‌జీది కీల‌క‌పాత్ర‌: ఎంపీ చామ‌ల‌

Chamala Kiran Kumar Reddy | సమాచార సాంకేతిక రంగంలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ బెదిరింపులను అరికట్టడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైబర్ సెక్యూరిటీ (Cyber Security) సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తాయని భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) అన్నారు.

G

Telangana | Published On Aug 29, 2026, 11.38 am IST

Chamala Kiran Kumar Reddy | సైబర్ బెదిరింపులను అరికట్టడంలో ఏఐ, సైబ‌ర్ సెక్యూరిటీ టెక్నాల‌జీది కీల‌క‌పాత్ర‌: ఎంపీ చామ‌ల‌
Advertisement

Chamala Kiran Kumar Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: సమాచార సాంకేతిక రంగంలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ బెదిరింపులను అరికట్టడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైబర్ సెక్యూరిటీ (Cyber Security) సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తాయని భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) అన్నారు. హైద‌రాబాద్‌లోని టీ వ‌ర్క్స్ (T-Works) ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రముఖ సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ జెన్‌సీ ల్యాబ్స్ (ZenC Labs)ను ఎంపీ చామ‌ల ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. హైద‌రాబాద్‌ను గ్లోబ‌ల్ ఐటీ హ‌బ్‌గా తీర్చిదిద్ద‌డంతో ప‌రిశోధ‌న ఆధారిత స్టార్ట‌ప్‌లు ఎంతో దోహ‌ద‌ప‌డ‌తాయ‌న్నారు. అత్యాధునిక సాంకేతికతతో సంస్థ‌ను ప్రారంభించిన‌ ఫౌండర్, సీఈవో రవి పుత్తా, వారి బృందాన్ని అభినందించారు. సంస్థ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్య‌క్ర‌మంలో జెన్‌సీ ల్యాబ్స్ చీఫ్ మెంటార్ మురళి తలసిల, అరబిందో ఫార్మా గ్రూప్ సీఐఓ చిట్టి బాబు, వాల్యూమోమెంటమ్ సీనియర్ వీపీ భరత్ అయ్యంగార్‌తో పాటు పలువురు సైబర్ సెక్యూరిటీ నిపుణులు, సాంకేతిక ప్రముఖులు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement