త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR Erravalli Farmhouse | ఎర్రవల్లికి కాంగ్రెస్ గూండాలు.. మమ్మల్ని ఆపుతారా?

కేసీఆర్ నివాసంపై దాడికి కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బొల్లారం వద్ద అసలేం జరిగిందంటే?

J

Telangana | Published On Sep 8, 2026, 1.17 pm IST

KCR Erravalli Farmhouse | ఎర్రవల్లికి కాంగ్రెస్ గూండాలు.. మమ్మల్ని ఆపుతారా?
Advertisement
  • ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌పై కాంగ్రెస్ శ్రేణుల దాడి యత్నం
  • కేసీఆర్‌కు మద్దతుగా వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను బొల్లారం వద్ద అడ్డుకున్న పోలీసులు
  • పోలీసుల తీరుపై మండిపడిన కేటీఆర్.. డీజీపీతో మాట్లాడాలని డిమాండ్
  • రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KCR Erravalli Farmhouse | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ సీఎం కేసీఆర్ నివాసం ఉన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేసీఆర్ పై దాడికి కాంగ్రెస్ సర్కార్ కుట్ర పన్నుతోందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎర్రవల్లికి వెళ్లకుండా బొల్లారం వద్ద బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసుల వలయాన్ని బ్రేక్ చేసి.. పాదయాత్రగా..

తమ అధినేతకు మద్దతుగా ఎర్రవల్లి బయలుదేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను పోలీసులు బొల్లారం చౌరస్తా వద్ద అడ్డుకోవడంతో పరిస్థితి టెన్షన్‌గా మారింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, అధికార పార్టీకి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని గులాబీ శ్రేణులు మండిపడ్డాయి. పోలీసుల నిర్బంధాన్ని బ్రేక్ చేసి.. అక్కడి నుంచే బీఆర్ఎస్ నేతలు ఎర్రవల్లి వైపు పాదయాత్రగా ముందుకు కదిలారు.

మీ డీజీపీ నెంబర్ ఇవ్వండి.. నేను మాట్లాడతా..

ఈ క్రమంలో పోలీసుల తీరుపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. "మీ సీపీ, డీజీపీ నెంబర్ ఇవ్వండి.. నేనే స్వయంగా మాట్లాడుతా. అసలు మీకు పై నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ (Instructions) ఏంటి? కాంగ్రెస్ వాళ్ళను గూండాల్లాగా కేసీఆర్ మీదకు పంపిస్తున్నారు. వాళ్లకు రోప్ పార్టీ (Rope party) పెట్టి మరీ ఎస్కార్ట్ ఇస్తున్నారు. వాళ్లని వదిలేసి మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు?" అంటూ అధికారులను నిలదీశారు.

రాష్ట్రంలో నడుస్తోంది రౌడీ రాజ్యం

తమ నాయకుడిని తామే కాపాడుకుంటామని స్పష్టం చేసిన కేటీఆర్.. పోలీసుల మీద తమకు నమ్మకం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు. "ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరుండి మరీ కేసీఆర్‌ను చంపించే ప్రయత్నం చేస్తున్నాడు. రాష్ట్రంలో ఒక రౌడీ రాజ్యం నడుస్తోంది" అంటూ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తే బీఆర్ఎస్ శ్రేణులు చూస్తూ ఊరుకోవని ఆయన హెచ్చరించారు.

Advertisement
Advertisement