త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mancherial | ఆరేండ్ల బిడ్డ‌ను న‌డుముకు క‌ట్టుకుని.. బావిలోకి దూకిన త‌ల్లి..

Mancherial | మంచిర్యాల (Mancherial) జిల్లా దండేప‌ల్లి మండ‌లంలో లింగాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ మ‌హిళ త‌న‌ ఆరేండ్ల బిడ్డను నడుముకు కట్టుకుని వ్యవసాయ బావిలోకి (Well) దూకి ఆత్మహత్య చేసుకుంది.

G

Telangana | Published On Aug 31, 2026, 12.55 pm IST

Mancherial | ఆరేండ్ల బిడ్డ‌ను న‌డుముకు క‌ట్టుకుని.. బావిలోకి దూకిన త‌ల్లి..
Advertisement

Mancherial | త్రినేత్ర‌.న్యూస్‌: మంచిర్యాల (Mancherial) జిల్లా దండేప‌ల్లి మండ‌లంలో లింగాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ మ‌హిళ త‌న‌ ఆరేండ్ల బిడ్డను నడుముకు కట్టుకుని వ్యవసాయ బావిలోకి (Well) దూకి ఆత్మహత్య చేసుకుంది.

లింగాపూర్ గ్రామానికి చెందిన గొట్ల రజిత (26)కు ఏడేండ్ల క్రితం జగిత్యాల (Jagtial) జిల్లా గొల్లపల్లి మండలంలోని వేనుగుమట్లకు చెందిన మెరుగు అంజయ్యతో వివాహ‌మైంది. వారికి కుమార్తె అక్షిత (6), కుమారుడు మహేందర్ (18 నెలలు) ఉన్నారు. కాగా, భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో రజిత త‌న పుట్టింటికి వ‌చ్చేసింది. గ‌త కొంతకాలంగా అక్క‌డే ఉంటున్న‌ది. పిల్లలను చూసేందుకు అంజ‌య్య అప్పుడ‌ప్పుడు అక్కడికి వచ్చివెళ్తున్నాడు.

ఈ క్ర‌మంలో ఆదివారం కూడా అత‌డు త‌న పిల్ల‌ల‌ను చూసి వెళ్లిపోయాడు. అత‌డు వెళ్లిన కొద్దిసేపటికే రజిత తన కుమారుడిని ప‌డుకోబెట్టి.. కుమార్తె అక్షిత‌ను తీసుకుని ఊరి స‌మీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. అక్కడ కుమార్తెను తన నడుముకు కట్టుకుని బావిలోకి దూకి ఆత్మహత్య (Suicide) చేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసుల‌కు, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృత‌దేహాల‌ను వెళికితీసి పోస్టు మార్టం నిమిత్తం ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నాయి. అయితే ర‌జిత ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, త‌ల్లీ కూతుళ్ల ఆత్మ‌హ‌త్య‌పై ఇప్ప‌టివ‌ర‌కు అధికారికంగా ఎవ‌రూ ఫిర్యాదు చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Advertisement
Advertisement