ITI | తుంగతుర్తిలో ఐటీఐ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్కు శంకుస్థాపన
ITI | వెనుకబడిన ప్రాంతాల్లో యువతకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక నైపుణ్య శిక్షణ అందించాలనే లక్ష్యంతో అడ్డగూడూరులో ఐటీఐ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్కు రాష్ట్ర మైనింగ్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు.
ITI | త్రినేత్ర.న్యూస్ : వెనుకబడిన ప్రాంతాల్లో యువతకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక నైపుణ్య శిక్షణ అందించాలనే లక్ష్యంతో అడ్డగూడూరులో ఐటీఐ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్కు రాష్ట్ర మైనింగ్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతంలో ఐటీఐ ఏర్పాటు కోసం భూమి పూజ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ రూ. 3,622 కోట్ల నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని మంత్రి ప్రశంసించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా వ్యవస్థను నాశనం చేసిందని, ఇచ్చిన హామీలను కేసీఆర్ మర్చిపోయారని విమర్శించారు. ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని స్పష్టం చేశారు.
ఇందిరమ్మ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను ఇప్పుడు మళ్లీ కొనసాగిస్తున్నామని, మంత్రిగా పేదలకు ఇళ్ల పంపిణీ జరుగుతోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆస్తుల కోసం పరస్పరం కొట్లాడుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
యంగ్ ఇండియా స్కూల్స్ పేదలకు వరంగా మారాయని, ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మంత్రి గుర్తు చేశారు. రానున్న రోజుల్లో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల అవుతాయని యువతకు భరోసా ఇచ్చారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా విద్యార్థులకు ఆధునిక శిక్షణ అందిస్తున్నామని, శిక్షణతో పాటు ఉద్యోగ భర్తీ కూడా చేయాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఉద్యమకారుడైన ఎమ్మెల్యే మందుల సామేల్ కోసం తుంగతుర్తిలో అత్యుత్తమ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, డీసీసీ అధ్యక్షుడు బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ అక్షయ్ యాదవ్, జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు, ఏఎస్పీ లక్ష్మీనారాయణ, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026

CM Revanth Reddy | బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్టు చేశాం : సీఎం రేవంత్ రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



