త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | వ‌ర్షాల కోసం 108 క‌ల‌శాల‌తో అభిషేకం.. మంత్రి పొన్నం వ‌రుణ‌యాగం

Ponnam Prabhakar | రాష్ట్రంలో స‌మృద్ధిగా కుర‌వాల‌ని ప్రార్థిస్తూ.. భ‌ద్ర‌కాళి స‌మ‌తే కొత్త‌కొండ వీర‌భ‌ద్ర స్వామి ఆల‌యంలో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ వ‌రుణ‌యాగం నిర్వ‌హించారు.

S

Telangana | Published On Jul 22, 2026, 4.15 pm IST

Ponnam Prabhakar | వ‌ర్షాల కోసం 108 క‌ల‌శాల‌తో అభిషేకం.. మంత్రి పొన్నం వ‌రుణ‌యాగం
Advertisement

Ponnam Prabhakar | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో స‌మృద్ధిగా కుర‌వాల‌ని ప్రార్థిస్తూ.. భ‌ద్ర‌కాళి స‌మ‌తే కొత్త‌కొండ వీర‌భ‌ద్ర స్వామి ఆల‌యంలో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ వ‌రుణ‌యాగం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ మీడియాతో మాట్లాడారు.

కాకతీయుల కాలం నాటి భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్రస్వామి మహిమ గల దేవుడు. ఈ ప్రాంత ప్రజలకు విశ్వాసం కలిగిన భగవంతుడు. ఇక్కడ వరుణయగం చేయడం వల్ల ఈ ప్రాంతమంతా సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని స్వామి వారికి 108 క‌ల‌శాల‌తో అభిషేకాలు చేయడం జరిగింది. స్వామి వారికి యజ్ఞ యాగాలు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.

ఎల్ నినో పరిస్థితుల్లో వర్షాలు పడవని శాస్త్రవేత్తలు చెబుతున్న సమాజం భగవంతుని మీద విశ్వాసం ఉన్న దృష్ట్యా యావత్ తెలంగాణలోని అన్ని దేవాలయాల్లో వరుణ యాగాలు ,ఇతర పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను హైదరాబాద్ ఇంచార్జి మంత్రిగా హైదరాబాద్‌లో జరుగుతున్న బోనాల పండుగ సందర్భంగా అన్ని దేవాలయాల్లో అమ్మవారిని ప్రార్థిస్తూ మంచి వర్షాలు పడాలని పూజలు చేయడం జరుగుతుంది. మహిమత్వం గల కాకతీయుల కాలం నాటి భద్రకాళి సమేత కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో వరుణయాగం చేసి మంచి వర్షాలు పడాలని స్వామి వారిని వేడుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం దేశమంతా సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్థించడం జరిగింది అని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు.

Advertisement
Advertisement