త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | బీసీ గురుకుల‌ విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌.. ఐఐటీ, ఎన్ఐటీల‌కు ఎంపికైతే ల్యాప్‌టాప్‌లు: మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

Ponnam Prabhakar | బీసీ గురుకుల విద్యార్థుల‌కు (BC Gurukula Students) ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఇక‌పై దేశంలోనే ప్ర‌ముఖ విద్యా సంస్థ‌లైన ఐఐటీ, ఐఐఐటీ, ఎన్‌ఐటీలకు ఎంపికయ్యే బీసీ గురుకుల విద్యాల‌యాల విద్య‌ర్థుల‌కు ల్యాప్‌టాప్‌లు (Laptops) ఇవ్వ‌నుంది.

G

Telangana | Published On Jun 26, 2026, 9.29 am IST

Ponnam Prabhakar | బీసీ గురుకుల‌ విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌.. ఐఐటీ, ఎన్ఐటీల‌కు ఎంపికైతే ల్యాప్‌టాప్‌లు: మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌
Advertisement

Ponnam Prabhakar | త్రినేత్ర‌.న్యూస్‌: బీసీ గురుకుల విద్యార్థుల‌కు (BC Gurukula Students) ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఇక‌పై దేశంలోనే ప్ర‌ముఖ విద్యా సంస్థ‌లైన ఐఐటీ, ఐఐఐటీ, ఎన్‌ఐటీలకు ఎంపికయ్యే బీసీ గురుకుల విద్యాల‌యాల విద్య‌ర్థుల‌కు ల్యాప్‌టాప్‌లు (Laptops) ఇవ్వ‌నుంది. ఈమేర‌కు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) వెల్ల‌డించారు. బీసీ విద్యార్థులకు అత్యుత్తమ విద్యా అవకాశాలు కల్పించడ‌మే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమ‌ని చెప్పారు. మ‌హాత్మా జ్యోతీబా పూలే బీసీ గురుకుల విద్యాసంస్థలను మరింత బలోపేతం చేసి, విద్యార్థులను జాతీయ స్థాయిలో పోటీపడేలా తీర్చితిద్దుతున్నామని తెలిపారు.

గురుకుల సొసైటీ వ్యవసాయ కాలేజీలో బీసీ గురుకుల విద్యార్థులకు అడ్మిషన్లు ఉంటాయన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల సొసైటీని (MJP BC Gurukula).. తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ మహాత్మా జ్యోతిరావు ఫులే విద్యాసంస్థల సొసైటీగా మార్చేందుకు నిర్ణ‌యించామ‌ని తెలిపారు. పేరు మార్పున‌కు బీసీ గురుకుల బోర్డు ఆమోదం తెలిపింద‌ని చెప్పారు.

 

Advertisement
Advertisement