Kishan Reddy | పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. రాజకీయంగా వాడుకుంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్: కిషన్ రెడ్డి
Kishan Reddy | ఇరాన్, అమెరికా యుద్ధం ప్రభావంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని (Petrol Diesel Price Hike) కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) వ్యాఖ్యానించారు. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయని చెప్పారు.
Kishan Reddy | త్రినేత్ర.న్యూస్: ఇరాన్, అమెరికా యుద్ధం ప్రభావంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని (Petrol Diesel Price Hike) కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) వ్యాఖ్యానించారు. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయని చెప్పారు. ఇది ప్రజల మీద భారం వేసేందుకు కాదన్నారు. అంతర్జాతీయ స్థాయిలో అమెరికా, జర్మనీ, జపాన్ లాంటి దేశాల్లో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని వెల్లడించారు.
క్రూడాయిల్ దిగుమతికి భారీగా ఖర్చవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. పని పాటలేని కాంగ్రెస్, బీఆర్ఎస్లు దీనిని రాజకీయంగా వాడుకుంటున్నాయని విమర్శించారు. ప్రజలు ఈ లాంటి మాటలకు మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుపై సగటున రూ.3 పెరిగిన విషయం తెలింది. దీంతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.50కు చేరగా, డీజిల్ రూ.98.70కి పెరిగింది. ఇక ఢిల్లీలో పెట్రోల్ రూ.97.77, డీజిల్ రూ.90.67, కోల్కతాలో పెట్రోల్ రూ.108.74, డీజిల్ రూ.95.13, ముంబైలో పెట్రోల్ రూ.106.68, డీజిల్ రూ.93.14, చెన్నైలో పెట్రోల్ రూ.103.67, డీజిల్ రూ.95.25గా ఉన్నాయి.
సీఎన్జీ కూడా..
మరోవైపు సంకుచిత సహజ వాయువు(సీఎన్జీ) రేట్లు కూడా పెరిగాయి. ఢిల్లీతో పాటు ముంబైలోనూ కిలోకి రూ.2 పెంచారు. పెరిగిన ధరలతో ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర రూ.87కి చేరింది. అయితే మిగతా నగరాల్లో మాత్రం సీఎన్జీ రేట్లలో మార్పు కనిపించడం లేదు.
సంబంధిత వార్తలు

Singireddy Niranjan Reddy | ధృతరాష్ట్ర ప్రభుత్వానికి రైతుల గోసలు కనిపించడం లేదు: నిరంజన్రెడ్డి
జులై 6, 2026

N. Ramchander Rao | కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ నాటకాలు వేస్తున్నాయి: రాంచందర్రావు
జులై 6, 2026

Harish Rao | ఐటీ పార్క్ నిర్మించాల్సిన చోట డంప్ యార్డా?.. ఆ జీవోను వెంటనే వెనక్కితీసుకోండి: హరీశ్ రావు
జులై 6, 2026
తాజావార్తలు
- ●OTT | సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ
- ●Telangana SIR Process | "ఒక వ్యక్తికి ఒకే ఓటు" కచ్చితంగా అమలు కావాలి.. SIR గడువు పొడిగించండి: కేటీఆర్
- ●Divyabharathi | హాట్ ఫొటోలతో రచ్చ చేసిన సుడిగాలి సుధీర్ హీరోయిన్
- ●Uttam Kumar Reddy | 2028 జూన్ కల్లా ఎస్ ఎల్ బీసీని పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ●Corporation chairmens tenure | రేపటితో 34 కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవీ కాలం పూర్తి..
- ●Ponnam Prabhakar | రాముడి పేరుతో దోచుకున్నందుకు బీజేపీ క్షమాపణ చెప్పాలి

OTT | సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

Telangana SIR Process | "ఒక వ్యక్తికి ఒకే ఓటు" కచ్చితంగా అమలు కావాలి.. SIR గడువు పొడిగించండి: కేటీఆర్

Divyabharathi | హాట్ ఫొటోలతో రచ్చ చేసిన సుడిగాలి సుధీర్ హీరోయిన్

Uttam Kumar Reddy | 2028 జూన్ కల్లా ఎస్ ఎల్ బీసీని పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి



