త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Corporation chairmens tenure | రేపటితో 34 కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవీ కాలం పూర్తి..

Corporation chairmens tenure | కార్పొరేషన్ ఛైర్మెన్ లుగా రెండేళ్ల పదవి కాలం రేపటితో పూర్తి కాబోతుంది. మరోసారి వీరికి పదవులు దక్కుతాయా లేదా అనేది పార్టీ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఒకరిద్దరికి మినహా ఈసారి కొత్తవారికి అవకాశం ఇవ్వాలనేది అధిష్టానం ఆలోచనగా ఉన్నట్టు సమాచారం.

S

Telangana | Published On Jul 6, 2026, 7.37 pm IST

Corporation chairmens tenure | రేపటితో 34 కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవీ కాలం పూర్తి..
Advertisement

Corporation chairmens tenure |  త్రినేత్ర‌.న్యూస్‌: కార్పొరేషన్ ఛైర్మెన్ లుగా రెండేళ్ల పదవి కాలం రేపటితో పూర్తి కాబోతుంది. మరోసారి వీరికి పదవులు దక్కుతాయా లేదా అనేది పార్టీ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఒకరిద్దరికి మినహా ఈసారి కొత్తవారికి అవకాశం ఇవ్వాలనేది అధిష్టానం ఆలోచనగా ఉన్నట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి.. ఇటీవల కొంతమంది ఛైర్మన్ల పనితీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండేళ్ల పదవి కాలంలో పార్టీ ప్రభుత్వ వ్యవహారాలు వదిలేసి అవినీతి అక్రమాలకు తెరలేపిన వారికి ఛైర్మెన్ లుగా కొనసాగించే ఛాన్స్ ఇవ్వరాదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోదఫా వీరిని కొనసాగిస్తే సీనియర్ నేతల్లో అసంతృప్తి పెరిగే ప్రమాదం వుందని పార్టీవర్గాలు భావిస్తున్నాయి. ఈసారి మండవ వెంకటేశ్వర్ రావు ,అరికెల నర్సా రెడ్డి, ఆకుల లలిత ,ధర్మపురి సంజయ్ డి రాజేశ్వర్ లాంటి నేతలకు నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి పార్టీ అగ్ర నేతలు ఇప్పటికే హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement