త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Student Missing | చ‌దువుపై అయిష్టంతో కాలేజీ నుంచి విద్యార్థిని అదృశ్యం.. మూడు రోజులపాటు ఉచిత‌ బ‌స్సులో చ‌క్క‌ర్లు..

Student Missing | రాష్ట్ర‌ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు (Free Bus) ప్ర‌యాణంతో ఎంతో మంది ల‌బ్ధిపొందుతున్నారు. త‌క్కువ జీతాలు పొందుతున్న‌, రోజువారీ కూలి ప‌నులు చేసుకునే మ‌హిళ‌లు బ‌స్సుల్లో జీరో టికెట్ వ‌ల్ల‌ ప్ర‌తి నెల సుమారు రూ.2 వేల వ‌ర‌కు ఆదాచేసుకుంటున్నారు. మ‌హిళ‌ల సాధికార‌త‌, ఆర్థిక భ‌ద్ర‌త కోసం ప్ర‌భుత్వ ప్ర‌వేశ పెట్టిన ఈ ప‌థాన్ని కొంద‌రు దుర్వినియోగం చేస్తున్నారు.

G

Telangana | Published On Jul 9, 2026, 10.37 am IST

Student Missing | చ‌దువుపై అయిష్టంతో కాలేజీ నుంచి విద్యార్థిని అదృశ్యం.. మూడు రోజులపాటు ఉచిత‌ బ‌స్సులో చ‌క్క‌ర్లు..
Advertisement

Student Missing | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్ర‌ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు (Free Bus) ప్ర‌యాణంతో ఎంతో మంది ల‌బ్ధిపొందుతున్నారు. త‌క్కువ జీతాలు పొందుతున్న‌, రోజువారీ కూలి ప‌నులు చేసుకునే మ‌హిళ‌లు బ‌స్సుల్లో జీరో టికెట్ వ‌ల్ల‌ ప్ర‌తి నెల సుమారు రూ.2 వేల వ‌ర‌కు ఆదాచేసుకుంటున్నారు. మ‌హిళ‌ల సాధికార‌త‌, ఆర్థిక భ‌ద్ర‌త కోసం ప్ర‌భుత్వ ప్ర‌వేశ పెట్టిన ఈ ప‌థాన్ని కొంద‌రు దుర్వినియోగం చేస్తున్నారు. చ‌దువుకోవ‌డం ఇష్టం లేని ఓ విద్యార్థిని (Student Missing) కాలేజీ నుంచి చెప్పాపెట్ట‌కుండా వ‌చ్చి.. బ‌స్సులో ఆధార్ కార్డు చూపించి మూడు రోజులు చ‌క్క‌ర్లు కొట్టింది. కేసును ఛేదించేందుకు పోలీసులు ముప్పుతిప్ప‌లు ప‌డ్డారు.

మంచిర్యాల (Mancherial) జిల్లా కోట‌ప‌ల్లి మండ‌ల కేంద్రంలోని క‌స్తూర్భాగాంధీ బాలిక‌ల విద్యాల‌యంలో (KGBV) ఓ బాలిక ఇంట‌ర్ ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం (Inter Student) చ‌దువుతున్న‌ది. చ‌దువుకోడంపై ఆస‌క్తి లేక‌పోవ‌డంతో చెప్పాపెట్ట‌కుండా ఈ నెల 5న తెల్ల‌వారుజామున‌ కాలేజీ నుంచి అదృశ్య‌మైంది. కాలేజీ నుంచి వెళ్లిన బాలిక.. ఇంటికి కూడా రాక‌పోవ‌డంతో ఆందోళ‌న‌కు గురైన త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసును ద‌ర్యాప్తు చేయ‌డం ప్రారంభించారు. కోట‌ప‌ల్లి నుంచి బైక్‌పై లిఫ్ట్ అడిగి వెళ్లిన‌ట్లు గుర్తించారు. ఆ త‌ర్వాత ఆధార్ కార్డుతో ఆర్టీసీ బ‌స్సులో చెన్నూరు నుంచి మంచిర్యాల‌, మంచిర్యాల నుంచి ఆదిలాబాద్ చేరుకుంది. అక్క‌డి నుంచి మంచిర్యాల‌కు వ‌చ్చి.. క‌రీంన‌ర‌గ్ వెళ్లింది. దీంతో క‌రీంన‌గ‌ర్ పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఈ క్ర‌మంలో అక్క‌డి నుంచి హైద‌రాబాద్ వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌గా.. పోలీసులు గుర్తించి ఆమెను ప‌ట్టుకున్నారు. మూడు రోజులు బ‌సులో చ‌క్క‌ర్లు కొట్టినట్లు తెలుసుకుని అవాక్క‌వ‌డం పోలీసుల వంత‌యింది.

 

Advertisement
Advertisement