త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | కేసీఆర్.. అసెంబ్లీ సమావేశాలు కూడా ఫాంహౌస్ లోనే నిర్వహించమంటారా?: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti Srinivas Reddy | బీఆర్ఎస్ శాస‌న‌స‌భా ప‌క్ష స‌మావేశం సిద్దిపేట జిల్లా ఎర్ర‌వెల్లిలోని కేసీఆర్ (KCR) ఫామ్‌హౌస్‌లో ఆదివారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు జ‌రుగ‌నుంది. ఫాం హౌస్‌లో స‌మావేశం నిర్వ‌హించ‌డంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) మండిప‌డ్డారు. అసెంబ్లీ స‌మావేశాల‌ను కూడా ఫాంహౌస్‌లోనే నిర్వ‌హించమంటారా? అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ప్ర‌శ్నించారు.

G

Telangana | Published On Sep 6, 2026, 10.49 am IST

Ponguleti Srinivas Reddy | కేసీఆర్.. అసెంబ్లీ సమావేశాలు కూడా ఫాంహౌస్ లోనే నిర్వహించమంటారా?: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Advertisement

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: బీఆర్ఎస్ శాస‌న‌స‌భా ప‌క్ష స‌మావేశం సిద్దిపేట జిల్లా ఎర్ర‌వెల్లిలోని కేసీఆర్ (KCR) ఫామ్‌హౌస్‌లో ఆదివారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు జ‌రుగ‌నుంది. ఫాం హౌస్‌లో స‌మావేశం నిర్వ‌హించ‌డంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) మండిప‌డ్డారు. అసెంబ్లీ స‌మావేశాల‌ను కూడా ఫాంహౌస్‌లోనే నిర్వ‌హించమంటారా? అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ప్ర‌శ్నించారు. ఫాంహౌస్‌లో శాసనసభాపక్ష సమావేశం నిర్వ‌హించ‌డం ఏం పద్దతి అంటూ విమ‌ర్శించారు.

దొర పోకడలతో బీఆర్ఎస్ పార్టీ (BRS party) నాయకులు వ్యవహరిస్తున్న తీరు రాచరిక రోజులను తలపిస్తున్న‌ద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో, గత 1000 రోజులలో రూ.1 కోటికి పైగా ప్రజాధనాన్ని జీతంగా తీసుకుని, రూ.21 కోట్లకు పైగా భద్రత, ఇతర సౌకర్యాల కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టింద‌ని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ శాసనసభకు హాజరుకాకుండా పూర్తిగా ఫాంహౌస్‌కే (Farm House) పరిమితమై ప్రజాస్వామ్య స్పూర్తిని కేసీఆర్ కాలరాశార‌ని వెల్ల‌డించారు. ఈ రోజు ఎర్రవెల్లి ఫాం హౌస్‌లో శాసనసభాపక్ష సమావేశం నిర్వహించడం నియంత పోకడలకు నిదర్శనమ‌ని చెప్పారు. ఇదే ధోరణి కొనసాగితే… రానున్న రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు (Assembly Session) కూడా ఫాం హౌస్‌ లోనే నిర్వహించాలని కేసీఆర్ డిమాండ్ చేసినా ఆశ్చర్యం లేదని వెల్ల‌డించారు.

Advertisement
Advertisement