త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | సిరిసిల్ల‌, సిద్దిపేట‌ల‌పై ఇక దండ‌యాత్రే

CM Revanth Reddy | ఈ నెల‌ఖారులోనే సిరిసిల్ల‌, సిద్దిపేట‌ల‌పై కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు దండ‌యాత్ర‌లు చేస్తార‌ని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంద‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు.

S

Telangana | Published On Sep 5, 2026, 8.17 pm IST

CM Revanth Reddy | సిరిసిల్ల‌, సిద్దిపేట‌ల‌పై ఇక దండ‌యాత్రే
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ఈ నెల‌ఖారులోనే సిరిసిల్ల‌, సిద్దిపేట‌ల‌పై కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు దండ‌యాత్ర‌లు చేస్తార‌ని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంద‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. న‌కిరేక‌ల్ స‌భ‌లో సీఎం ప్ర‌సంగిస్తూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ఇక త‌ర్వాత క‌దం సిరిసిల్ల‌లోనే. పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్ కుమార్ గౌడ్‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నా.. ఈ నెల‌ఖారు నాటికి సిరిసిల్ల‌కు పోదాం రంగం సిద్ధం చేయండి.. అంద‌రం పోదాం. ఈ నెల‌ఖారుకు సిరిసిల్ల వ‌స్తా.. సిరిసిల్ల గ‌డ్డ మీద మూడు రంగుల జెండా ఎగురేస్తా.. ఇక సిరిసిల్ల త‌ర్వాత సిద్దిపేట మీద దండ‌యాత్ర చేస్తాం. బావ‌బామ్మ‌ర్దులు క‌లిసి బంధువుల‌ను తెచ్చుకుంటారో, బానిస‌ల‌ను తెచ్చుకుంటారో, చెంచ‌గాళ్ల‌నో తెచ్చుకుంటారో, చెప్పులు మోసేటోళ్ల‌ను తెచ్చుకుంటారో.. ఎవ‌రెవ‌ర్నీ తెచ్చుకుంటారో తెచ్చుకోండి.. తేల్చుకుందాం.. మా కాంగ్రెస్ సైన్యంతో సిరిసిల్ల‌, సిద్దిపేట వ‌స్తా. కాసుకోండి క‌ల్వ‌కుంట్ల కుటుంబ‌మా.. అని సీఎం రేవంత్ అన్నారు.

Advertisement
Advertisement