త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Huzurabad Sub Jailor | రిమాండ్ ఖైదీకి మెరుగైన సౌక‌ర్యాలు.. ఏసీబీకి చిక్కిన హుజురాబాద్ స‌బ్ జైల‌ర్

Huzurabad Sub Jailor | రిమాండ్ ఖైదీగా ఉన్న ఓ వ్య‌క్తికి మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు లంచం డిమాండ్ చేసిన హుజురాబాద్ స‌బ్ జైల‌ర్ నాంప‌ల్లి దేవేంద‌ర్‌(46)ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు.

S

Telangana | Published On Sep 7, 2026, 10.26 pm IST

Huzurabad Sub Jailor | రిమాండ్ ఖైదీకి మెరుగైన సౌక‌ర్యాలు.. ఏసీబీకి చిక్కిన హుజురాబాద్ స‌బ్ జైల‌ర్
Advertisement

Huzurabad Sub Jailor | త్రినేత్ర‌.న్యూస్ : రిమాండ్ ఖైదీగా ఉన్న ఓ వ్య‌క్తికి మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు లంచం డిమాండ్ చేసిన హుజురాబాద్ స‌బ్ జైల‌ర్ నాంప‌ల్లి దేవేంద‌ర్‌(46)ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. బాధిత వ్య‌క్తి నుంచి స‌బ్ జైలు పెట్రోల్ బంకులో ప‌ని చేస్తున్న రావుల హ‌రీశ్‌(30) ద్వారా స‌బ్ జైల‌ర్ దేవేంద‌ర్ రూ. 10 వేలు లంచం తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారులు ప‌ట్టుకున్నారు.

అనంతరం సబ్ జైలు కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి కీలక రికార్డులను పరిశీలించారు. ​లంచం తీసుకున్న సబ్ జైలర్‌ దేవేందర్‌ను అదుపులోకి తీసుకున్నామని, ఆయనపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే ప్రజలు నిర్భయంగా ఏసీబీ అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు.

Advertisement
Advertisement