త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tolichowki SI | రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డ్డ టోలిచౌకి ఎస్ఐ

Tolichowki SI | హైద‌రాబాద్ న‌గ‌రంలోని టోలిచౌకి ఎస్ఐ ఆర్ పాండు నాయ‌క్ ఏసీబీ అధికారుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌ట్టాడు. ఫిర్యాదుదారుడు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు ఎస్ఐ అడ్డంగా దొరికిపోయాడు.

S

Hyderabad | Published On Sep 1, 2026, 10.58 pm IST

Tolichowki SI | రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డ్డ టోలిచౌకి ఎస్ఐ
Advertisement

Tolichowki SI | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌రంలోని టోలిచౌకి ఎస్ఐ ఆర్ పాండు నాయ‌క్ ఏసీబీ అధికారుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌ట్టాడు. ఫిర్యాదుదారుడు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు ఎస్ఐ అడ్డంగా దొరికిపోయాడు.

తల్లి ఇచ్చిన ఫిర్యాదులో తనపై ఎలాంటి కేసు నమోదు చేయవద్దని, అదేవిధంగా పాస్‌పోర్టును సీజ్‌ చేయవద్దని పాండు నాయ‌క్‌ను బాధితుడు కోరాడు. ఇందుకు ఎస్ఐ రూ. 10 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఈ క్ర‌మంలో ఏసీబీని ఆశ్ర‌యించాడు బాధితుడు. మంగ‌ళ‌వారం పాండు నాయ‌క్ రూ. 10 వేలు తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. అవినీతికి పాల్పడినందుకుగాను అతడిపై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement