త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | కేసీఆర్ ఆదేశాల మేర‌కు హ‌రీశ్‌రావు ఢిల్లీ వెళ్లారు : బీఆర్ఎస్ పార్టీ

Harish Rao | మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్ రావు (Harish Rao) ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌డం రాష్ట్రంలో తీవ్ర చ‌ర్చ‌నీయాశంమ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఆదేశాల మేర‌కు పార్టీ త్రిస‌భ్య క‌మిటీ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ట్లు స్ప‌ష్టం చేసింది.

D

Telangana | Published On Apr 20, 2026, 2.30 pm IST

Harish Rao | కేసీఆర్ ఆదేశాల మేర‌కు హ‌రీశ్‌రావు ఢిల్లీ వెళ్లారు : బీఆర్ఎస్ పార్టీ
Advertisement

Harish Rao | మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్ రావు (Harish Rao) ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌డం రాష్ట్రంలో తీవ్ర చ‌ర్చ‌నీయాశంమ‌వుతోంది. నేడు సాయంత్రం జ‌గిత్యాల‌లో పార్టీ అధినేత కేసీఆర్ బ‌హిరంగ‌ స‌భ ఉన్న‌ప్ప‌టికీ హ‌రీశ్‌రావు హ‌స్తిన‌కు వెళ్ల‌డంపై కాంగ్రెస్ పార్టీ నేత‌లు ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బీఆర్ఎస్ పార్టీ స్పందించింది.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఆదేశాల మేర‌కు పార్టీ త్రిస‌భ్య క‌మిటీ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఈ ప్ర‌తినిధుల బృందంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఉన్న‌ట్లు పేర్కొంది. ఏప్రిల్ 22వ తేదీన తెలంగాణ హైకోర్టులో కాళేశ్వ‌రం క‌మిష‌న్‌పై వెలువ‌డ‌నున్న తుది తీర్పు, అలాగే ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుల నేప‌థ్యంలో త‌దుప‌రి న్యాయ‌ప‌ర‌మైన కార్యాచ‌ర‌ణ సిద్ధం చేసేందుకు ఈ బృందం ఢిల్లీ వెళ్లిన‌ట్లు తెలిపింది. సుప్రీంకోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాదుల‌తో ఈ క‌మిటీ ప్ర‌త్యేకంగా స‌మావేశం అవుతుంద‌ని వెల్ల‌డించింది. కాళేశ్వరం కమిషన్‌పై హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలపై, అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో న్యాయపరంగా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై లాయర్లతో చర్చించనున్న‌ట్లు వివ‌రించింది. ఈ మేర‌కు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

Also Read..

జ‌పాన్‌ను కుదిపేసిన శ‌క్తిమంత‌మైన భూకంపం.. సునామీ హెచ్చ‌రిక‌లు జారీ.. ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావొద్దు

తొలి మినీ ఎల్ఈడీ టీవీ సిరీస్‌ను లాంచ్ చేసిన తోషిబా.. అదిరిపోయిన డిస్‌ప్లే, ఆడియో ఫీచ‌ర్లు..

హైద‌రాబాద్ నుంచి వెళ్లిన విమానంలో సాంకేతిక స‌మ‌స్య‌.. 4 గంట‌ల‌పాటూ గాల్లోనే చ‌క్క‌ర్లు.. భ‌యంతో వ‌ణికిపోయిన ప్ర‌యాణికులు

ట్యాగ్స్:

Advertisement
Advertisement