త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gutha Sukender Reddy | రాష్ట్రాభివృద్ధికి ప్రవాసులు ముందుకు రావాలి.. ఎక్క‌డ స్థిర‌ప‌డినా మాతృభూమిని మ‌రవొద్దు: గుత్తా సుఖేందర్ రెడ్డి

Gutha Sukender Reddy | రాష్ట్రాభివృద్ధికి ప్ర‌వాస తెలుగువారంద‌రు ముందుకు రావాల‌ని, తెలంగాణ (Telangana) అభివృద్ధిలో భాగ‌స్వాములు కావాల‌ని శాస‌న మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు.

G

Telangana | Published On Jul 29, 2026, 11.49 am IST

Gutha Sukender Reddy | రాష్ట్రాభివృద్ధికి ప్రవాసులు ముందుకు రావాలి.. ఎక్క‌డ స్థిర‌ప‌డినా మాతృభూమిని మ‌రవొద్దు: గుత్తా సుఖేందర్ రెడ్డి
Advertisement

Gutha Sukender Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రాభివృద్ధికి ప్ర‌వాస తెలుగువారంద‌రు ముందుకు రావాల‌ని, తెలంగాణ (Telangana) అభివృద్ధిలో భాగ‌స్వాములు కావాల‌ని శాస‌న మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. ఎక్క‌డ స్థిర‌ప‌డినా, ఎంత స్థాయికి ఎదిగినా మాతృభూమిని మ‌ర‌చిపోవ‌ద్ద‌ని చెప్పారు. అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం ర్యాలీ నగరంలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) ఆధ్వర్యంలో అక్కడ స్థిరపడిన తెలుగు ప్రజలతో సమావేశ‌మ‌య్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు శ్రీను యాదవ్ నాగనబోయిన, కరుణాకర్ వంగూరు, శేఖర్ నల్లబోతుల, రవీందర్ గడ్డంపల్లి తదితరులు గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డిని ఘ‌నంగా సత్కరించారు. అనంత‌రం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రవాస భారతీయుల పాత్ర, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతికి ప్రవాసుల సహకారం వంటి పలు అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎక్కడ స్థిరపడిన, ఎంత స్థాయికి ఎదిగిన మన మాతృభూమిని మరచిపోవద్దని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సారథ్యంలో రాష్ట్రం ప్రగతిపథంలో నడుస్తున్న‌దని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయిలు , అసోసియేషన్ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement