త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raja Singh | తెలంగాణ బీజేపీలో గ్రూప్ రాజ‌కీయాలు.. అందుకే జాతీయ కార్యవర్గంలో ఒక్క‌రికీ చోటు దక్కలే: ఎమ్మెల్యే రాజాసింగ్

Raja Singh | బీజేపీ (BJP) అధ్య‌క్షుడు నితిన్ న‌బీన్ ఇటీవ‌ల‌ ప్ర‌క‌టించిన నూత‌న‌ జాతీయ కార్య‌వ‌ర్గంలో తెలంగాణ (Telangana) నేత‌ల‌కు స్థానం ద‌క్క‌పోవ‌డం ప‌ట్ల ఆ పార్టీ మాజీ నేత‌, గోషామ‌హ‌ల్ ఎమ్మెల్య రాజాసింగ్ (Raja Singh) విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు.

G

Telangana | Published On Aug 19, 2026, 11.05 am IST

Raja Singh | తెలంగాణ బీజేపీలో గ్రూప్ రాజ‌కీయాలు.. అందుకే జాతీయ కార్యవర్గంలో ఒక్క‌రికీ చోటు దక్కలే: ఎమ్మెల్యే రాజాసింగ్
Advertisement

Raja Singh | త్రినేత్ర‌.న్యూస్‌: బీజేపీ (BJP) అధ్య‌క్షుడు నితిన్ న‌బీన్ ఇటీవ‌ల‌ ప్ర‌క‌టించిన నూత‌న‌ జాతీయ కార్య‌వ‌ర్గంలో తెలంగాణ (Telangana) నేత‌ల‌కు స్థానం ద‌క్క‌పోవ‌డం ప‌ట్ల ఆ పార్టీ మాజీ నేత‌, గోషామ‌హ‌ల్ ఎమ్మెల్య రాజాసింగ్ (Raja Singh) విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. రాష్ట్ర బీజేపీలో ప్రతిసారి గ్రూప్ రాజకీయాలు (Group Politics), ఢిల్లీకి ఫిర్యాదులు చేసుకుంటార‌ని, అందుకే జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నాయకులకు చోటు దక్కలేదని మండిప‌డ్డారు. ఇప్పటికైనా తెలంగాణ బీజేపీ నాయకులు మారాలంటూ హిత‌వు ప‌లికారు.

బీజేపీ అదిష్ఠానం (Nitin Nabin) గ‌త సోమ‌వారం జాతీయ కార్య‌వ‌ర్గాన్ని (New National Team) ప్ర‌క‌టించింది. అందులో తెలంగాణ నుంచి ఒక్కరంటే ఒక్కరికి కూడా చోటుదక్కలేదు. ప్రస్తుతం రాష్ట్రం నుంచి జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్న డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్‌, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్‌కు ఈసారి చోటు దక్కకపోగా, వారి పదవులు కూడా రెన్యువల్‌ కాలేదు. దీంతో ఓవైపు మిష‌న్ తెలంగాణ (Mission Telangana) అంటూ 2028లో అధికార‌మే ల‌క్ష్యమ‌ని చెబుతున్న పార్టీ హైక‌మాండ్‌.. కీల‌క‌మై జాతీయ క‌మిటీలో మాత్రం రాష్ట్రానికి ప్రాతినిధ్యం క‌ల్పించ‌క‌పోవ‌డంతో సొంత పార్టీ నేత‌లే విస్మ‌యం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

Advertisement
Advertisement