త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nizamabad | నిజామాబాద్‌లో ప్రైవేట్‌ బస్సు బోల్తా.. నలుగురు ప్రయాణికులు మృతి

Nizamabad | నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఇంద‌ల్వాయిలో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. గురువారం రాత్రి ఇంద‌ల్వాయి మండ‌లం గన్నారం వద్ద ప్రైవేట్‌ బస్సు (Private Bus) అదుపుత‌ప్పి బోల్తా పడింది. దీంతో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. ప‌లువ‌రు గాయ‌ప‌డ్డారు.

G

Telangana | Published On Mar 13, 2026, 7.56 am IST

Nizamabad | నిజామాబాద్‌లో ప్రైవేట్‌ బస్సు బోల్తా.. నలుగురు ప్రయాణికులు మృతి
Advertisement

Nizamabad | త్రినేత్ర‌.న్యూస్‌: నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఇంద‌ల్వాయిలో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. గురువారం రాత్రి ఇంద‌ల్వాయి మండ‌లం గన్నారం వద్ద ప్రైవేట్‌ బస్సు (Private Bus) అదుపుత‌ప్పి బోల్తా పడింది. దీంతో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. ప‌లువ‌రు గాయ‌ప‌డ్డారు.

గువారం రాత్రి 22 మంది ప్రయాణికులతో ప్రైవేటు బ‌స్సు హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అకొలకు బయల్దేరింది. ఈ క్ర‌మంలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో గ‌న్నారం వ‌ద్ద‌ 44వ జాతీయ రహదారిపై బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. స్థానికులతో క‌లిసి సహాయక చర్యలు చేపట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను జిల్లా ప్రభుత్వ ద‌వాఖాన‌కు తరలించారు. మృతుల వివ‌రాలు తెలియాల్సి ఉన్న‌ది. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవికూడా చ‌ద‌వండి..

16 నుంచి వారం రోజుల‌పాటు వాన‌లు.. ప‌లు జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్‌

అక‌డ‌మిక్ ప‌రీక్ష‌లు ముగుస్తున్నాయి.. ఇక ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ వంతు.. ఏ Exam ఎప్పుడంటే?

ముందే మొదలైన ఎండల భగభగ.. దేశంలో 75 శాతం ప్రజలకు తీవ్ర ముప్పు: రికార్డులు బద్దలు కొడుతున్న ఉష్ణోగ్రతలు

 

Advertisement
Advertisement