త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Electric Bus | మ‌రో ఎల‌క్ట్రిక్ బ‌స్సులో చెల‌రేగిన మంట‌లు.. రెండు వారాల్లో రెండో ఘ‌ట‌న‌

Electric Bus | ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సుల్లో (Electric Bus) వరుసగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కరీంనగర్‌ ఆర్టీసీ బస్టాండ్‌లో నిలిపి ఉన్న మరో ఎలక్ట్రిక్‌ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో ప్ర‌యాణికుల భ‌ద్ర‌త‌పై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ది.

G

Telangana | Published On Jul 1, 2026, 9.42 am IST

Electric Bus | మ‌రో ఎల‌క్ట్రిక్ బ‌స్సులో చెల‌రేగిన మంట‌లు.. రెండు వారాల్లో రెండో ఘ‌ట‌న‌
Advertisement

Electric Bus | త్రినేత్ర‌.న్యూస్‌: ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సుల్లో (Electric Bus) వరుసగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు వారాల క్రితం క‌రీంగ‌న‌ర్ జిల్లా (Karimnagar) అలుగునూర్‌ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఎలక్ట్రిక్‌ బస్సు పూర్తిగా దగ్ధమైన ఘటన మరువకముందే.. తాజాగా కరీంనగర్‌ ఆర్టీసీ బస్టాండ్‌లో నిలిపి ఉన్న మరో ఎలక్ట్రిక్‌ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో ప్ర‌యాణికుల భ‌ద్ర‌త‌పై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ది.

కరీంనగర్‌ ఆర్టీసీ బస్టాండ్‌లో నిలిపి ఉన్న ఎలక్ట్రిక్‌ బస్సు బ్యాటరీ విభాగంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్ర‌మంగా అవి బ‌స్సు మొత్తానికి వ్యాపించ‌డంతో మంటలు ఎగ‌సిప‌డ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఆ స‌మ‌యంలో బస్సులో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ప్రాణాపాయం త‌ప్పింది. బ్యాటరీలో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

గ‌త నెల 21న అలుగునూర్‌ శివారులో ఎల‌క్ట్రిక్ బ‌స్సు కాలి బూడిదైన విష‌యం తెలిసిందే. కరీంనగర్‌–హైదరాబాద్‌ మార్గంలో వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సులో ఒక్క‌సారిగా మంటలు చెలరేగాయి. అయితే అప్ర‌మ‌త్త‌మైన‌ డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపి ప్రయాణికులందరినీ కిందకు దించడంతో అంతా సుర‌క్షితంగా బయటపడ్డారు. మూడు ఫైర్‌ ఇంజన్లు రెండు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.

Advertisement
Advertisement