త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RTC Bus | పూటుగా తాగి ఆర్టీసీ బస్సుతో ఉడాయించాడు.. 21 కిలోమీట‌ర్ల త‌ర్వాత‌..

RTC Bus | పీక‌ల‌దాకా మ‌ద్యం తాగిన ఓ వ్య‌క్తి (Drunk Man) మ‌త్తులో ఆర్టీసీ బ‌స్సుతో (RTC Bus) ఉడాయించాడు. అస‌లు మ‌త్తు.. ఆపై బ‌స్సు స్పీడుగా వెళ్తుండ‌టంతో గ‌మ్మ‌త్తు అనిపించిందో ఏమో.. 21 కిలోమీట‌ర్ల దూరం తీసుకెళ్లాడు.

G

Telangana | Published On Jul 10, 2026, 11.05 am IST

RTC Bus | పూటుగా తాగి ఆర్టీసీ బస్సుతో ఉడాయించాడు.. 21 కిలోమీట‌ర్ల త‌ర్వాత‌..
Advertisement

RTC Bus | త్రినేత్ర‌.న్యూస్‌: పీక‌ల‌దాకా మ‌ద్యం తాగిన ఓ వ్య‌క్తి (Drunk Man) మ‌త్తులో ఆర్టీసీ బ‌స్సుతో (RTC Bus) ఉడాయించాడు. అస‌లు మ‌త్తు.. ఆపై బ‌స్సు స్పీడుగా వెళ్తుండ‌టంతో గ‌మ్మ‌త్తు అనిపించిందో ఏమో.. 21 కిలోమీట‌ర్ల దూరం తీసుకెళ్లాడు. అయితే అక్క‌డ టోల్‌గేట్ (Toll Gate) రావ‌డంతో అదుపుచేయ‌లేక సిమెంటు దిమ్మెను ఢీకొట్టాడు. ఇంకేముంది సారుగారిని పోలీసులు ప‌ట్టుకుని స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

వెంక‌న్న అనే వ్య‌క్తి ఫుల్‌గా తాగాడు. మ‌ద్యం మ‌త్తులో జ‌న‌గామ (Jangaon) బ‌స్టాండ్‌కు వెళ్లాడు. అక్క‌డ నిలిపి ఉన్న ఆర్టీసీ ఓ బ‌స్సులో ఎక్కి.. దానిని స్టార్ట్ చేసుకుని అక్క‌డినుంచి ఉడాయించాడు. ఈ క్ర‌మంలో 21 కిలోమీట‌ర్ల త‌ర్వాత సింగరాజు పల్లి టోల్ గేట్ వద్ద సిమెంట్ దిమ్మెను ఢీకొట్టాడు. దీంతో టోల్‌ గేట్ సిబ్బంది పోలీసుల‌కు సమాచారం అందించారు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బస్సు యజమాని ఫిర్యాదుతో కేసు న‌మోదుచేశారు. మద్యం మత్తు, మానసిక పరిస్థితి కారణంగానే ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement