త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chevella | ఆర్టీసీ బ‌స్సు ఢీకొని ఇంట‌ర్ విద్యార్థి మృతి

Chevella | క‌ళాశాలకు వెళ్లేందుకు బ‌స్సు కోసం వెయిట్ చేస్తున్న విద్యార్థిని ఆర్టీసీ బ‌స్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాల‌పాలైన బాధిత విద్యార్థి క్ష‌ణాల్లోనే క‌న్నుమూశాడు.

S

Telangana | Published On Jul 1, 2026, 12.38 pm IST

Chevella | ఆర్టీసీ బ‌స్సు ఢీకొని ఇంట‌ర్ విద్యార్థి మృతి
Advertisement

Chevella | త్రినేత్ర‌.న్యూస్ : క‌ళాశాలకు వెళ్లేందుకు బ‌స్సు కోసం వెయిట్ చేస్తున్న విద్యార్థిని ఆర్టీసీ బ‌స్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాల‌పాలైన బాధిత విద్యార్థి క్ష‌ణాల్లోనే క‌న్నుమూశాడు. ఈ ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండ‌ల కేంద్రంలోని షాబాద్ చౌర‌స్తా వ‌ద్ద బుధ‌వారం ఉద‌యం చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. చేవెళ్ల మండ‌ల ప‌రిధిలోని కందాడ గ్రామానికి చెందిన షేర్ కృష్ణారెడ్డి రెండో కుమారుడు సాత్విక్ రెడ్డి.. మొయినాబాద్‌లోని ఓ ప్ర‌యివేటు కాలేజీలో ఇంట‌ర్ ద్వితీయ సంవ‌త్స‌రం చ‌దువుతున్నాడు. ఇక బుధ‌వారం ఉద‌యం ఇంటి నుంచి బ‌య‌ల్దేరిన సాత్విక్ రెడ్డి.. బ‌స్సు కోసం షాబాద్ చౌర‌స్తా వ‌ద్ద ఆగాడు. అదే స‌మ‌యంలో అటు వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బ‌స్సు.. దాని ముందున్న కారును త‌ప్పించ‌బోయి రోడ్డు ప‌క్క‌న నిల్చున్న సాత్విక్ రెడ్డిని ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాల‌పాలైన బాధిత విద్యార్థిని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, అప్ప‌టికే ప్రాణాలు కోల్పోయిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.

Advertisement
Advertisement