Chevella | ఆర్టీసీ బస్సు ఢీకొని ఇంటర్ విద్యార్థి మృతి
Chevella | కళాశాలకు వెళ్లేందుకు బస్సు కోసం వెయిట్ చేస్తున్న విద్యార్థిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన బాధిత విద్యార్థి క్షణాల్లోనే కన్నుమూశాడు.
Chevella | త్రినేత్ర.న్యూస్ : కళాశాలకు వెళ్లేందుకు బస్సు కోసం వెయిట్ చేస్తున్న విద్యార్థిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన బాధిత విద్యార్థి క్షణాల్లోనే కన్నుమూశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని షాబాద్ చౌరస్తా వద్ద బుధవారం ఉదయం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. చేవెళ్ల మండల పరిధిలోని కందాడ గ్రామానికి చెందిన షేర్ కృష్ణారెడ్డి రెండో కుమారుడు సాత్విక్ రెడ్డి.. మొయినాబాద్లోని ఓ ప్రయివేటు కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇక బుధవారం ఉదయం ఇంటి నుంచి బయల్దేరిన సాత్విక్ రెడ్డి.. బస్సు కోసం షాబాద్ చౌరస్తా వద్ద ఆగాడు. అదే సమయంలో అటు వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు.. దాని ముందున్న కారును తప్పించబోయి రోడ్డు పక్కన నిల్చున్న సాత్విక్ రెడ్డిని ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన బాధిత విద్యార్థిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●KC Venugopal | బీజేపీకి రాజ్యాంగంపై ఎలాంటి విశ్వాసం లేదు : కేసీ వేణుగోపాల్
- ●Bandi Bageerath | బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ విచారణ.. జులై 3కి వాయిదా
- ●GST | జూన్లో జీఎస్టీ వసూళ్ల జోరు.. రూ.1.94 లక్షల కోట్లకు చేరిక..
- ●Gen Dhiraj Seth | 'విజయ్' నినాదంతో.. నూతన ఆర్మీ చీఫ్గా ఛార్జ్ తీసుకున్న జనరల్ ధీరజ్ సేథ్
- ●MP Mallu Ravi | రాముని బాటలో రేవంత్.. రావణాసురుడి బాటలో బీజేపీ
- ●Telegram | టెలిగ్రామ్లో మళ్లీ మెసేజ్ ఎడిట్ ఫీచర్.. పాత తరహాలోనే పనిచేస్తుంది..

KC Venugopal | బీజేపీకి రాజ్యాంగంపై ఎలాంటి విశ్వాసం లేదు : కేసీ వేణుగోపాల్

Bandi Bageerath | బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ విచారణ.. జులై 3కి వాయిదా

GST | జూన్లో జీఎస్టీ వసూళ్ల జోరు.. రూ.1.94 లక్షల కోట్లకు చేరిక..

Gen Dhiraj Seth | 'విజయ్' నినాదంతో.. నూతన ఆర్మీ చీఫ్గా ఛార్జ్ తీసుకున్న జనరల్ ధీరజ్ సేథ్




