త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cyber Crime | ప్ర‌భుత్వ ప‌థ‌కం పేరుతో.. ఏకంగా ఎమ్మెల్యేకే బురిడీ

Cyber Crime | ఆయ‌న ఉన్న‌త‌ విద్యావంతుడు. ఎన్నో విద్యాసంస్థ‌ల‌కు అధిప‌తి. ఆయ‌న‌కు ఓ యూనివ‌ర్సిటీ కూడా ఉన్న‌ది. అంతేకాదు గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీగా చేసిన ఆయ‌న ప్ర‌స్తుతం ఎమ్మెల్యే (MLA) కూడా. అయినప్ప‌టికీ సైబ‌ర్ నేర‌గాళ్ల చేతులో మోస‌పోయారు.

G

Telangana | Published On Apr 9, 2026, 11.22 am IST

Cyber Crime | ప్ర‌భుత్వ ప‌థ‌కం పేరుతో.. ఏకంగా ఎమ్మెల్యేకే బురిడీ
Advertisement

Cyber Crime | త్రినేత్ర‌.న్యూస్‌: ఆయ‌న ఉన్న‌త‌ విద్యావంతుడు. ఎన్నో విద్యాసంస్థ‌ల‌కు అధిప‌తి. ఆయ‌న‌కు ఓ యూనివ‌ర్సిటీ కూడా ఉన్న‌ది. అంతేకాదు గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీగా చేసిన ఆయ‌న ప్ర‌స్తుతం ఎమ్మెల్యే (MLA) కూడా. అయినప్ప‌టికీ సైబ‌ర్ నేర‌గాళ్ల చేతులో మోస‌పోయారు. అందులోనూ ప్ర‌భుత్వ ప‌థ‌కాల (Cyber Crime) పేరు చెప్ప‌డంతో ఈజీగా కేటుగాళ్ల‌ బుట్ట‌లో ప‌డిపోయారు. ఆయ‌నే జ‌న‌గామ‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి (Palla Rajeshwar Reddy). బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌విలో ఉన్న ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించారంటే సామాన్యులు ఇంకెంత అప్ర‌మ‌త్తంగా ఉండాలో ఆలోచించాలి.

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఫోన్ చేసిన ఓ గుర్తు తెలియని వ్యక్తి.. తెలంగాణ ఆర్థిక శాఖ‌లో అద‌ప‌ను కార్య‌ద‌ర్శి నంటూ ప‌రిచ‌యం చేసుకున్నారు. త‌న పేరు అనంతరామిరెడ్డి అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కొత్త‌గా 'వికసిత్ భారత్' పథకం ప్ర‌వేశ‌పెట్టింద‌ని, ఈ ప‌థ‌కం కింద ఒక్కొక్క‌రికి రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తున్నామని నమ్మించాడు. నియోజకవర్గంలో 40 మంది అర్హులైన లబ్ధిదారుల జాబితాను పంపాలని, దరఖాస్తుకు ఈరోజే చివరి రోజని ఎమ్మెల్యేపై ఒత్తిడి పెంచాడు. స్కీమ్ ప్రాసెసింగ్ ఫీజు కింద ఒక్కొక్క‌రికి రూ.2500 ఖ‌ర్చు అవుతుంద‌ని, త‌క్ష‌ణ‌మే రూ.లక్ష ఫోన్ పే చేయాలని కోరాడు. దీంతో ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గంట వ్యవధిలోనే ఆ మొత్తాన్ని నిందితుడు చెప్పిన నంబర్‌కు బదిలీ చేశారు. త‌ర్వాత ఆ నంబ‌ర్‌కి మ‌ళ్లీ ఫోన్స్ చేస్తే స‌మాధానం రాక‌పోవ‌డంతో.. మోస‌పోయాన‌ని గ్ర‌హించిన ఎమ్మెల్యే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 319 (2), 318 (4), ఐటీ యాక్ట్ 66c, 66d కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఓ ఎమ్మెల్యేని, అందులోనూ ప్ర‌భుత్వం ప‌థ‌కం పేరుచెప్పి మోసం చేయ‌డంపై సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ ఘ‌ట‌న‌పై నెటిజ‌న్లు ఒక్కోర‌కంగా స్పందిస్తున్నారు. ఏకంగా ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించారు.. ఇదీ ట్యాలెంట్ అంటే! అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Advertisement