KCR | కేసీఆర్ ఫాంహౌజ్ ఎదుట కాంగ్రెస్ ధర్నా
KCR | మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఫాంహౌజ్ ఎదుట కాంగ్రెస్ (Congress) పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. తక్షణమే కేసీఆర్ అసెంబ్లీ (Assembly)కి వెళ్లి గజ్వేల్ (Gajwel) ప్రజల సమస్యల పరిష్కారం కోసం మాట్లాడాలంటూ నినదించారు. సారూ అసెంబ్లీకి రావా.. బయటికి రావా అని ప్లకార్డులు ప్రదర్శించారు.
KCR | త్రినేత్ర.న్యూస్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఫాంహౌజ్ ఎదుట కాంగ్రెస్ (Congress) పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. తక్షణమే కేసీఆర్ అసెంబ్లీ (Assembly) కి వెళ్లి గజ్వేల్ (Gajwel) ప్రజల సమస్యల పరిష్కారం కోసం మాట్లాడాలంటూ నినదించారు. సారూ అసెంబ్లీకి రావా.. బయటికి రావా అని ప్లకార్డులు ప్రదర్శించారు. కేసీఆర్ బయటకు రావాలంటూ రెడ్కార్పెట్ పరిచి, పూలు చల్లి ఆహ్వానించారు. అసెంబ్లీకి వెళ్లకుంటే వెంటనే కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని ప్రకటించినప్పటికీ నియోజకవర్గ సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావిస్తారని ఆశించినప్పటికీ నిరాశే ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటిరోజు మాత్రమే హాజరై వెనుదిరిగారని అన్నారు.
గజ్వేల్ ప్రజలు గెలిపించింది నియోజకవర్గ సమస్యలను పరిష్కరించేందుకని చెప్పారు. కానీ కేసీఆర్ అదిమరిచి, వ్యవసాయం చేసుకుంటూ, ప్రజలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. ఆయన ప్రజల సమస్యలు తీర్చే ఆసక్తి లేకపోతే స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేసి, మరొకరికి అవకాశం కల్పించాలని కోరారు. రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తోందని అన్నారు. కానీ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకుపోకుండా అవి ఎలా పరిష్కారమవుతాయని ప్రశ్నించారు.
ఇప్పటికైనా కేసీఆర్ బయటకు రావాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి హాజరై నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కోరారు. అప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

BRS Constituency Incharges | 119 నియోజకవర్గాల ఇంచార్జీలు వీరే.. ప్రకటించిన గులాబీ అధినేత కేసీఆర్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



