త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uttam Kumar Reddy | కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చాకే రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ఆగింది: మంత్రి ఉత్తమ్

Uttam Kumar Reddy | తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వ‌చ్చిన త‌రువాతే త‌మ ఒత్తిడి వ‌ల్లే రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం (Rayalaseema Lift Irrigation Scheme) ఆగింద‌ని మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్ప‌ష్టం చేశారు. గతంలో ఆగిఉంటే బీఆర్ఎస్ (BRS) ఎందుకు చెప్పలేదని ప్ర‌శ్నించారు.

A

Telangana | Published On Jan 5, 2026, 3.02 pm IST

Uttam Kumar Reddy | కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చాకే రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ఆగింది: మంత్రి ఉత్తమ్
Advertisement

Uttam Kumar Reddy | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాతే రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం (Rayalaseema Lift Irrigation Scheme) ఆగింద‌ని నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్ప‌ష్టం చేశారు. గతంలో ఆగిఉంటే బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ఎందుకు చెప్పలేదని ప్ర‌శ్నించారు. త‌మ ఒత్తిడి వ‌ల్లే ఏపీ ప్ర‌భుత్వం ఎత్తిపోత‌ల ప‌థ‌కం ప‌నులు ఆపేశార‌ని చెప్పారు. బీఆర్ఎస్ హ‌యాంలో కృష్ణ‌-గోదావ‌రి జ‌లాల విష‌యంలో తెలివి ఎక్కువ‌, ప‌ని త‌క్కువ చందంగా వ్య‌వ‌హ‌రించార‌ని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అతి తెలివితో తెలంగాణ‌కు భారీన‌ష్టం చేసింద‌ని ఆరోపించారు. పాల‌మూరు-రంగారెడ్డిని జూరాల నుంచి శ్రీ‌శైలంకు మార్చడంతో పాటు, తుమ్మిడి హెట్టి నుంచి మేడిగ‌డ్డ‌కు కాళేశ్వ‌రంను మార్చి భారీ న‌ష్టం చేశార‌ని మండిప‌డ్డారు.

పోలవరం - నల్లమల్ల సాగర్‌ను త‌మ ప్ర‌భుత్వం అన్ని వేదిక‌ల‌పైనా వ్య‌తిరేకిస్తున్నామ‌ని ఉత్త‌మ్ చెప్పారు. హరీష్ రావు చూపిస్తున్న లేఖ దీనికి సంబంధించినది కాదని అన్నారు. పోలవరం - నల్లమల్ల అంత‌ర్ రాష్ట్ర నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేక‌మ‌ని తాము గ‌తంలోనే జీఆర్ఎంబీకి లేఖ రాశామ‌ని, త‌మ అభిప్రాయాన్ని సైతం జీఆర్ఎంబీ స‌మ‌ర్థించింద‌ని వివ‌రించారు. ఈ ప్రాజెక్టును మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క కూడా వ్య‌తిరేకిస్తున్నాయ‌ని గుర్తు చేశారు. సుప్రీంకోర్టులో వాద‌న‌లు బ‌లంగా వినిపించాల‌ని న్యాయ‌వాది అభిషేక్ సింఘ్వీకి సూచించామ‌న్నారు. ఈ కేసును వ‌చ్చే సోమ‌వారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింద‌ని, రిట్ పిటిష‌న్ కాకుండా సూట్ పిటిష‌న్‌లో రావాల‌ని సూచించింద‌ని చెప్పారు. ఈ కేసులో స్టే ఇవ్వాల‌ని సుప్రీంకోర్టును వ‌చ్చే సోమ‌వారం కోరుతామ‌ని తెలిపారు. త‌దుప‌రి విచార‌ణ‌కు తాను నేరుగా హాజ‌ర‌వుతాన‌ని ప్ర‌క‌టించారు. ఒక‌ట్రెండు రోజుల్లో మ‌రోసారి న్యాయ‌వాదుల‌తో స‌మావేశ‌మ‌వుతామ‌ని స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement