Rayalaseema Lift Irrigation Scheme | బీఆర్ ఎస్ ఫిర్యాదుతోనే రాయలసీమ ‘లిప్ట్’ నిలిచిపోయింది: ఏపీ మంత్రి సవిత
Rayalaseema Lift Irrigation Scheme | రాయలసీమ ఎత్తిపోతల పథకం (Rayalaseema Lift Irrigation Scheme) నిలిచిపోయేందుకు ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అని మంత్రి ఏపీ ఎస్.సవిత (Savitha) స్పష్టంచేశారు. 2020లో ఆనాటి తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో ఎన్జీటీ పథకాన్ని నిలిపివేయించిందని చెప్పారు.
2020లో అప్పటి తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదు
ఎన్జీటీ ఆదేశంతో ఎత్తిపోతల పథకం నిలిపివేత
ఏపీ నీటి హక్కులపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టీకరణ
Rayalaseema Lift Irrigation Scheme | రాయలసీమ ఎత్తిపోతల పథకం (Rayalaseema Lift Irrigation Scheme) నిలిచిపోయేందుకు ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అని రాష్ట్ర మంత్రి ఎస్.సవిత (Savitha) స్పష్టంచేశారు. సీఎం చంద్రబాబును బూచిగా చూపి రాజకీయ ఉనికి చాటుకోవడం తెలంగాణ రాష్ట్ర అధికార, విపక్షాలకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. 2020లో ఎటువంటి అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథక నిర్మాణం చేపడుతున్నామని జగన్ ప్రభుత్వం అట్టాహాసంగా ప్రకటించిందన్నారు. ఈ ప్రకటనపై ఆనాటి తెలంగాణ (Telangana)లో అధికారంలో ఉన్న కేసీఆర్ (KCR) నేతృత్వంలోని ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో, కేంద్రంతో పాటు ఎన్జీటీ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకున్నాయన్నారు. ఇదే విషయంపై అప్పట్లో మీడియాలోనూ ప్రచురితమైన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. జగన్ చేసిన తప్పిదాలను తన సొంత మీడియా ద్వారా కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడా తప్పిదాన్ని మభ్య పెడుతూ, తెలంగాణ సీఎం పేరుతో ఆయన సొంత మీడియాలో తప్పుడు రాతలు రాస్తున్నారన్నారు. ఇది ముమ్మాటికీ రాయలసీమకు జగన్ చేసిన ద్రోహమేనన్నారు. ఏపీ నీటి హక్కులు, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మంత్రి సవిత తేల్చిచెప్పారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



