త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Niranjan Reddy | యాప్ పోయి కార్డు వచ్చిందా? యూరియా కోసం రైతులు చలిలో వణుకుతూ పడిగాపులు కాయాలా?

తెల్లవారుజాము నుండి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యూరియా కోసం లైన్లు కట్టి, చలికి వణుకుతూ పడిగాపులు కాస్తున్నారు. శాసనసభలో ప్రభుత్వం మార్కెట్లో యూరియా కొరత లేదని అబద్దాలు చెబుతుంది.

J

Telangana | Published On Jan 5, 2026, 2.51 pm IST

Niranjan Reddy | యాప్ పోయి కార్డు వచ్చిందా? యూరియా కోసం రైతులు చలిలో వణుకుతూ పడిగాపులు కాయాలా?
Advertisement

Niranjan Reddy | బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు. యూరియా సరఫరాలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఖండించారు. యూరియా సరఫరాలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందన్నారు. నిన్నటి వరకు యూరియా కోసం యాప్‌లో బుక్ చేసుకోవాలన్నారు. ఇప్పుడు యూరియా కార్డు అంటున్నారు. అసలు యూరియా సరఫరా చేయలేకనే ప్రభుత్వం ఇలాంటి కొర్రీలు పెడుతోందని మండిపడ్డారు. తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం భేషరతుగా క్షమాపణ చెప్పాలి. తెల్లవారుజాము నుండి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యూరియా కోసం లైన్లు కట్టి, చలికి వణుకుతూ పడిగాపులు కాస్తున్నారు. శాసనసభలో ప్రభుత్వం మార్కెట్లో యూరియా కొరత లేదని అబద్దాలు చెబుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే యూరియా కొరతకు కారణమన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement