త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Koppula Eshwar | సింగరేణిని నామ‌రూపాల్లేకుండా చేసేందుకు కుట్ర : కొప్పుల ఈశ్వర్

Koppula Eshwar | సింగరేణి సంస్థను నామరూపాలు లేకుండా చేయడం కోసమే దుర్మార్గమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. రామగుండం ఆర్జీ-1, ఓసీపీ-5లో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, టీజీబీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి బొగ్గు నిల్వలను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

P

Telangana | Published On Jun 12, 2026, 3.19 pm IST

Koppula Eshwar | సింగరేణిని నామ‌రూపాల్లేకుండా చేసేందుకు కుట్ర : కొప్పుల ఈశ్వర్
Advertisement

Koppula Eshwar | సింగరేణి సంస్థను నామరూపాలు లేకుండా చేయడం కోసమే దుర్మార్గమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. రామగుండం ఆర్జీ-1, ఓసీపీ-5లో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, టీజీబీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి బొగ్గు నిల్వలను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం చూపిస్తున్న బొగ్గు నిల్వల లెక్కల వాస్తవాలను వివరించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ సింగరేణి సంస్థలో వరుస కుంభకోణాలతో సంస్థనే ప్రశ్నార్థకం చేసేలా దోపిడీ జరుగుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస కుంభకోణాలకు తెరలేపుతోందని ఆరోపించారు. ఒకప్పుడు సింగరేణి సంస్థ ఈ ప్రాంతంలోని అనేక మంది పేదలకు ఉద్యోగాలు కల్పించి, లక్షల కుటుంబాలకు జీవనోపాధి చూపించిందని ఆయన గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం ఓబీ కాంట్రాక్టులు, సోలార్ పవర్ ప్లాంట్లు, డెటోనేటర్ కాంట్రాక్టులు, పవర్ ప్రాజెక్టుల విషయంలో కుంభకోణాల పరంపర కొనసాగుతోందని విమర్శించారు.

అధికారిక లెక్కలు, సింగరేణి వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం సంస్థ వ్యాప్తంగా వివిధ గనుల వద్ద 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోందన్నారు. ఆర్జీ-1, ఓసీపీ-5లో 6 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉందని, ప్రస్తుతం 3.60 లక్షల టన్నులు ఉన్నాయని చెబుతున్నారని తెలిపారు. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే మట్టి పెల్లలు, బండలు, పనికిరాని వ్యర్థాలను కుప్పలుగా వేసి వాటినే బొగ్గుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అక్కడ 50 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు కూడా ఉన్నట్లు కనిపించడం లేద‌న్నారు. సింగరేణి సంస్థను సర్వనాశనం చేయడంతో పాటు కార్మికుల జీవితాలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆడుకుంటోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి నేతృత్వంలోనే అనేక అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బొగ్గు నిల్వలు ఎక్కడెక్కడ చూపిస్తున్నారో అక్కడ ఇదే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని, లేని బొగ్గును ఎలా సృష్టించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రజాధనాన్ని వృథా చేయడంలో ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో ఈ ఉదంతం ద్వారా అర్థమవుతోందన్నారు. సింగరేణి ప్రజల ఆస్తి అని, దానిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. ఇటీవల గోదావరిఖనికి వచ్చిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పలు అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని, అందులో ముఖ్యంగా డిపెండెంట్ ఉద్యోగాల అంశాన్ని ప్రస్తావించారని తెలిపారు. 400 మంది కార్మికులను అన్‌పిట్ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న విషయాన్ని హరీష్ రావు వెల్లడించారని పేర్కొన్నారు. ఈ విషయం బయటకు వస్తే పరువు పోతుందని భావించిన అధికారులు రెండు రోజుల్లో కార్మికులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించేందుకు సిద్ధమవుతున్నారన్నారు. సింగరేణిలో చోటుచేసుకుంటున్న వరుస కుంభకోణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement