Contract Employees Salary Telangana | ఇక ఏజెన్సీల ఆటకట్టు.. ఒకటో తేదీనే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏజెన్సీల మోసాలకు చెక్ పెట్టేలా సరికొత్త ప్లాన్!
- కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెలా 1 నుంచి 5వ తేదీలోపు వేతనాలు
- పీఎఫ్ (PF), ఈఎస్ఐ (ESI) చెల్లించని 4,300 ఏజెన్సీలపై కఠిన చర్యలకు ఆదేశం
- ఉద్యోగుల డేటా, బ్యాంక్ ఖాతాల వివరాలు పూర్తిగా డిజిటలైజేషన్
- కొత్త విధానం అమలుపై నివేదిక ఇచ్చేందుకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు
- 100 రోజుల్లో రిపోర్ట్
- కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష
Contract Employees Salary Telangana | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ (Contract and Outsourcing) ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఇకపై వీరికి కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు అందించేలా రాష్ట్ర సర్కార్ సన్నాహాలు చేస్తోంది. మంగళవారం హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ (MCRHRD)లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో.. ఏజెన్సీల దోపిడీకి చెక్ పెడుతూ 'డిజిటల్ గవర్నెన్స్' (Digital Governance) అమలుపై సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఏజెన్సీల మోసాలపై సీరియస్
ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 4,800 కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం నుంచి నెలనెలా డబ్బులు తీసుకుంటున్నప్పటికీ, దాదాపు 4,300 ఏజెన్సీలు ఉద్యోగులకు సరైన సమయానికి జీతాలు ఇవ్వడం లేదని అధికారుల ద్వారా సీఎం దృష్టికి వచ్చింది. అంతేకాకుండా ఉద్యోగులకు కల్పించాల్సిన పీఎఫ్ (PF), ఈఎస్ఐ (ESI) వంటివి కూడా చెల్లించడం లేదని తేలింది. దీనిపై తీవ్రంగా స్పందించిన సీఎం రేవంత్.. ఆయా ఏజెన్సీలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సమస్యలకు చెక్ పెట్టేలా 'డిజిటల్ గవర్నెన్స్'
మధ్యవర్తుల (ఏజెన్సీల) ప్రమేయం లేకుండా ఉద్యోగులకు పారదర్శకంగా జీతాలు చెల్లించేందుకు పరిపాలనను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బ్యాంక్ అకౌంట్ వివరాలు, శాలరీ డేటాను పూర్తిగా ఆన్లైన్ చేయనున్నారు. దీనివల్ల ప్రతి నెలా 1 నుంచి గరిష్టంగా 5వ తేదీలోగా జీతాలు నేరుగా ఉద్యోగుల ఖాతాల్లోనే జమయ్యే అవకాశం ఉంటుంది.

100 రోజుల్లో కమిటీ రిపోర్ట్
ఈ కొత్త విధానం అమలుతో పాటు.. డిజిటల్ గవర్నెన్స్పై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఈ కమిటీ కచ్చితంగా 100 రోజుల్లోగా (100 days deadline) ఈ అంశాన్ని ఒక కొలిక్కి తీసుకువచ్చి.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.

అలాగే, రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డులు (Health Cards) త్వరగా అందేలా వారి వివరాలను కూడా డిజిటలైజ్ చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు (Monitoring) ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఈ కీలక సమావేశంలో సీఎస్ సంజయ్ జాజు, సలహాదారు రామకృష్ణారావు, MA&UD స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Pune Ketan Agarwal Death Case | కేతన్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్: కాబోయే భర్తను చంపకముందే ప్రియుడిని పెళ్లాడిన సియా!
- ●Sanju Samson | 12 బంతుల్లోనే నమ్మకం పోయిందా? ప్రపంచకప్ హీరో శాంసన్ను పక్కన పెట్టేశారా?
- ●Kajal Aggarwal | ఓ వైపు షూటింగ్...మరోవైపు ప్రమోషన్స్ - కాజల్ అగర్వాల్ డబుల్ డ్యూటీ
- ●Rythu Bharosa | 8 ఎకరాల్లోపు రైతులకు 'భరోసా' నిధులు విడుదల.. ఇప్పటి వరకు రూ. 7750.45 కోట్లు జమ
- ●Tummala Nageshwar Rao | ఆయిల్ పామ్ సాగు విస్తరణకు అత్యంత ప్రాధాన్యత : మంత్రి తుమ్మల
- ●Stock Markets | అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లకు భారీ షాక్, రూ.2 లక్షల కోట్లు ఆవిరి..

Pune Ketan Agarwal Death Case | కేతన్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్: కాబోయే భర్తను చంపకముందే ప్రియుడిని పెళ్లాడిన సియా!

Sanju Samson | 12 బంతుల్లోనే నమ్మకం పోయిందా? ప్రపంచకప్ హీరో శాంసన్ను పక్కన పెట్టేశారా?

Kajal Aggarwal | ఓ వైపు షూటింగ్...మరోవైపు ప్రమోషన్స్ - కాజల్ అగర్వాల్ డబుల్ డ్యూటీ

Rythu Bharosa | 8 ఎకరాల్లోపు రైతులకు 'భరోసా' నిధులు విడుదల.. ఇప్పటి వరకు రూ. 7750.45 కోట్లు జమ






