త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Konda Surekha | కాంగ్రెస్‌లో మ‌ళ్లీ విభేదాలు.. క‌డియంపై హైక‌మాండ్‌కు కొండా సురేఖ ఫిర్యాదు

Konda Surekha | కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌త వివాదాలు మ‌ళ్లీ భ‌గ్గుమ‌న్నాయి. మంత్రి కొండా సురేఖ, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు రోజురోజుకు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. కడియంపై కాంగ్రెస్ అధిష్టానానికి, సీఎం రేవంత్‌కు కొండా సురేఖ మ‌రోసారి ఫిర్యాదు చేశారు.

S

Telangana | Published On Jul 7, 2026, 2.28 pm IST

Konda Surekha | కాంగ్రెస్‌లో మ‌ళ్లీ విభేదాలు.. క‌డియంపై హైక‌మాండ్‌కు కొండా సురేఖ ఫిర్యాదు
Advertisement

Konda Surekha | త్రినేత్ర‌.న్యూస్‌: కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌త వివాదాలు మ‌ళ్లీ భ‌గ్గుమ‌న్నాయి. మంత్రి కొండా సురేఖ, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు రోజురోజుకు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. కడియంపై కాంగ్రెస్ అధిష్టానానికి, సీఎం రేవంత్‌కు కొండా సురేఖ మ‌రోసారి ఫిర్యాదు చేశారు. ఆయ‌న వ్య‌వ‌హార శైలిపై లేఖ రాశారు. అయితే ఇటీవ‌ల వారిద్ద‌రి మ‌ధ్య కుదిరిన రాజీకి మ‌ళ్లీ బ్రేక్ ప‌డిన‌ట్టేనా? అన్న చ‌ర్చ పార్టీ నాయ‌కుల్లో జోరందుకుంది. ఈ విష‌యం ప్రస్తుతం సంచలనంగా మారింది.

కాగా నిన్న స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌ నియోజకవర్గంపై క‌డియం హైదరాబాద్‌లో దేవాదాయ శాఖ కమిషనర్‌తో ఎండోమెంట్ సమీక్ష నిర్వ‌హించారు. రివ్యూ అనంతరం ఉమ్మడి వరంగల్ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు సూచించారు. అయితే జిల్లా వ్యవహారాల్లో కడియం జోక్యం చేసుకోవడంపై కొండా సురేఖ తీవ్ర అభ్యంతరం తెలిపారు. త‌న‌కు తెలియ‌కుండా ఎలా రివ్యూ చేస్తార‌ని ఆమె మండిప‌డ్డారు. అయితే ఆమె ఫిర్యాదుపై అధిష్టానంతో పాటు సీఎం రేవంత్ ఎలా స్పందిస్తార‌నే విష‌యం ఆస‌క్తిక‌రంగా మారింది.

మ‌హేశ్‌కుమార్ గౌడ్ ఆరా..

కడియంపై స్టేట్‌ కమాండ్‌కి కాకుండా నేరుగా ఏఐసీసీకి ఫిర్యాదు చేయ‌డంతో టీపీసీసీ చీఫ్ మహేష్‌ కుమార్‌ గౌడ్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. సురేఖ‌ ఫిర్యాదుపై ఆయ‌న‌ ఆరా తీశారు. హైకమాండ్‌కు రాసిన లేఖను బయ‌ట‌పెట్టొద్ద‌ని ఆమెకు పీసీసీ చీఫ్‌ సూచించినట్లు సమాచారం. గతంలో ఇలాంటి వివాద‌మే త‌లెత్త‌గా మ‌ళ్లీ మంత్రి హైకమాండ్‌కు ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

 

Advertisement
Advertisement