త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | ఉమ్మడి పాల‌మూరులో సీఎం రేవంత్ ప‌ర్య‌ట‌న‌.. కాట్రేవుల‌ప‌ల్లి ఎత్తిపోత‌ల ప‌నుల ప‌రిశీల‌న‌

Revanth Reddy | ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప‌ర్య‌టిస్తున్నారు. ఇందులో భాగంగా మక్తల్- నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం (MNKLIS), భీమా, కృష్ణా నదులపై ప్రతిపాదిత బ్యారేజీల ప‌నుల పురోగ‌తిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

G

Telangana | Published On Jun 4, 2026, 6.35 pm IST

Revanth Reddy | ఉమ్మడి పాల‌మూరులో సీఎం రేవంత్ ప‌ర్య‌ట‌న‌.. కాట్రేవుల‌ప‌ల్లి ఎత్తిపోత‌ల ప‌నుల ప‌రిశీల‌న‌
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప‌ర్య‌టిస్తున్నారు. ఇందులో భాగంగా మక్తల్- నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం (MNKLIS), భీమా, కృష్ణా నదులపై ప్రతిపాదిత బ్యారేజీల ప‌నుల పురోగ‌తిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్, ప్లాన్ మ్యాప్స్‌ను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుకున్నారు. అవసరమైన కొన్ని సూచనలు చేశారు.

బెంగ‌ళూరు నుంచి నేరుగా పాల‌మూరు చేరుకున్న సీఎం.. మంత్రులు, అధికారుల‌తో క‌లిసి మక్తల్ మండలం కాట్రేవుపల్లి గ్రామ సమీపంలో కొనసాగుతున్న ఎత్తిపోతల ప్రాజెక్టు ప్యాకేజీ -1 సైట్ వద్ద పనులను పరిశీలించారు. ప్యాకేజీ-1లో భాగంగా జరుగుతున్న పంప్ హౌస్, కెనాలు పనులు ఎంత మేరకు పూర్తయ్యాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాంక్రీటు పనులను ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

సీఎం రేవంత్ వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో పాటు క‌ర్ణాట‌క‌ మాజీ మంత్రి ఎన్ఎస్ బోసెరాజు, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement