CM Revanth Reddy | తెల్వని దొంగ మోదీ.. సీఎం రేవంత్ విమర్శ
CM Revanth Reddy | ప్రధాని నరేంద్ర మోదీ తెల్వని దొంగ అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. దీపం పథకం కింద రూ. 400కే గ్యాస్ సిలిండర్ను సోనియా గాంధీ పంపిణీ చేస్తే.. మోదీ వచ్చి రూ. 1200కు పెంచి మనకు తెలియకుండానే దోచుకుంటున్నాడని విమర్శలు గుప్పించారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : ప్రధాని నరేంద్ర మోదీ తెల్వని దొంగ అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. దీపం పథకం కింద రూ. 400కే గ్యాస్ సిలిండర్ను సోనియా గాంధీ పంపిణీ చేస్తే.. మోదీ వచ్చి రూ. 1200కు పెంచి మనకు తెలియకుండానే దోచుకుంటున్నాడని విమర్శలు గుప్పించారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ఇందిరమ్మ టవర్స్కు శంకుస్థాపన చేసిన సీఎం.. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఎవరిపై కూడా విమర్శలు చేయను. సమయాన్ని వృథా చేసుకోను. గత పదేండ్ల పాలన, రెండున్నరేండ్ల మా పాలనను బేరిజు వేసుకోండి. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ సంక్షేమ పథకాన్ని రద్దు చేయలేదు. రైతు భరోసా, ఉచిత కరెంట్.. వాళ్లు ఏం ఇచ్చారో అవన్నీ ఇవ్వడంతో పాటు 3 కోట్ల ప్రజలకు ఆరు కిలోల సన్నబియ్యం ఇస్తున్నాం. దొడ్డు బియ్యం ఇస్తే బర్రెలకు, కోళ్లకు దాణా పెట్టుకునే పరిస్థితి. ఇవాళ సన్నబియ్యంతో చంటి పిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టే పరిస్థితి. కోట్లాది మంది సన్న బియ్యం బువ్వ తింటున్నరని సీఎం తెలిపారు.
ఇవాళ 500లకే సిలిండర్
భూమి ఉన్నోళ్లకే రైతు భరోసా, ఉచిత కరెంట్, ఎరువులు ఇస్తివి అని అంటే.. పట్నంలో ఉన్నోళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నాం. 55 లక్షల కుటుంబాలు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు. దీపం పథకం ద్వారా రూ. 400కే సోనియా గాంధీ ఆడబిడ్డలకు సిలిండర్ పంపిణీ చేశారు. మోదీ 1200 చేసిండు సిలిండర్. తెల్వని దొంగ మోదీ.. మనకు తెలియకుండానే 1200 తీసుకుపోతుండే కానీ ఇవాళ 500లకే సిలిండర్ ఇస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.
బతుకమ్మ చీరలను పిట్టలను బెదరగొట్టానికి కట్టేటోళ్లు
బతుకమ్మ చీరలను పిట్టలను బెదరగొట్టానికి కట్టేటోళ్లు. కర్టెన్లుగా కట్టుకునేవారు. కానీ ఇవాళ ఆ బతుకమ్మ చీరలు ఇస్తామంటే.. వద్దన్నారు. మేం పెట్టే ఇందిరమ్మ చీరను పుట్టింటి సారెగా భావించి కట్టుకుంటున్నరు. కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీర పెట్టిన. బస్సు కిరాయికి ఐదు నుంచి పది వేలు ఖర్చు అయ్యేది.. ఆ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. వడ్డీ లేని రుణాలు అని చెప్పి గుండు సున్నా చూపించారని రేవంత్ విమర్శించారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | కూకట్పల్లి ప్రజల రుణం తీర్చుకుంటా : సీఎం రేవంత్ రెడ్డి
ఆగస్టు 13, 2026

CM Revanth Reddy | కాంగ్రెస్ ఉన్నంత కాలం దేశంలో సెక్యులర్ వర్గాలకు మనుగడ : సీఎం రేవంత్ రెడ్డి
ఆగస్టు 13, 2026

V Hanumantha Rao | చంచల్గూడ స్టీల్ బ్రిడ్జికి ఆ యోధురాలి పేరు పెట్టండి.. సీఎం రేవంత్కు వీహెచ్ లేఖ
ఆగస్టు 13, 2026
తాజావార్తలు
- ●Mulkanoor inscription | ముల్కనూరులో 10వ శతాబ్దపు అరుదైన శాసనం లభ్యం.. చరిత్రను చెప్పే 'కాటమయ్య గుండు'
- ●CM Revanth Reddy | కూకట్పల్లి ప్రజల రుణం తీర్చుకుంటా : సీఎం రేవంత్ రెడ్డి
- ●Venkatesh | విక్టరీ వెంకటేష్ ఆకలిదేవుడు - అనౌన్స్మెంట్ తర్వాత ఆగిపోయిన భారీ బడ్జెట్ మూవీ - డైరెక్టర్ ఎవరంటే?
- ●TMC Rebel MPs | స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టుకే: 20 మంది రెబల్ ఎంపీలపై టీఎంసీ గురి
- ●Tigress vs Buffaloes | ఆడ పులిపై బర్రెల దాడి.. ప్రాణాలతో బయటపడ్డ యజమాని
- ●Shalini Pandey | బికినీలో అర్జున్ రెడ్డి హీరోయిన్ - ఇటలీ ట్రిప్ జ్ఞాపకాల్లో...

Mulkanoor inscription | ముల్కనూరులో 10వ శతాబ్దపు అరుదైన శాసనం లభ్యం.. చరిత్రను చెప్పే 'కాటమయ్య గుండు'

CM Revanth Reddy | కూకట్పల్లి ప్రజల రుణం తీర్చుకుంటా : సీఎం రేవంత్ రెడ్డి

Venkatesh | విక్టరీ వెంకటేష్ ఆకలిదేవుడు - అనౌన్స్మెంట్ తర్వాత ఆగిపోయిన భారీ బడ్జెట్ మూవీ - డైరెక్టర్ ఎవరంటే?

TMC Rebel MPs | స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టుకే: 20 మంది రెబల్ ఎంపీలపై టీఎంసీ గురి



