త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | 2 గంట‌ల‌కు రాష్ట్రంలో పెట్రోల్‌, గ్యాస్ సిలిండర్లు, యూరియా నిల్వలపై సీఎం రేవంత్ కీలక భేటీ

Revanth Reddy | ఇరాన్ యుద్ధం నేప‌థ్యంలో భార‌త్‌లో ఇంధ‌న కొర‌త ఏర్ప‌డింది. ముఖ్యంగా పెట్రోల్ (Petrol), డీజిల్, గ్యాస్ కొర‌త తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న‌ది. హైద‌రాబాద్‌లో ప‌రిస్థితి మ‌రింత అధ్వానంగా త‌యారైంది.

G

Telangana | Published On Mar 25, 2026, 10.46 am IST

Revanth Reddy | 2 గంట‌ల‌కు రాష్ట్రంలో పెట్రోల్‌, గ్యాస్ సిలిండర్లు, యూరియా నిల్వలపై సీఎం రేవంత్ కీలక భేటీ
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: ఇరాన్ యుద్ధం నేప‌థ్యంలో భార‌త్‌లో ఇంధ‌న కొర‌త ఏర్ప‌డింది. ముఖ్యంగా పెట్రోల్ (Petrol), డీజిల్, గ్యాస్ కొర‌త తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న‌ది. హైద‌రాబాద్‌లో ప‌రిస్థితి మ‌రింత అధ్వానంగా త‌యారైంది. పెట్రోల్‌, డీజిల్ దొర‌క‌ద‌న్న భ‌యంతో ప్ర‌జ‌లు బంకుల వ‌ద్దకు ప‌రుగులు తీస్తున్నారు. దీంతో న‌గ‌రంలో ఏ పెట్రోల్ బంక్ వ‌ద్ద చూసినా కిలోమీట‌ర్ల మేర క్యూలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. కొంత‌మంది పెద్ద పెద్ద ట్యాంకుల్లో నింపుకుని వెళ్తున్నారు.

ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో పెట్రోల్‌, గ్యాస్ సిలిండర్లు, యూరియా నిల్వలపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక సమావేశం నిర్వ‌హించ‌నున్నారు. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు అసెంబ్లీ కమిటీ హాల్‌లో మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వ‌హిస్తారు. ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. ముఖ్యంగా పెట్రోల్‌, గ్యాస్ కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు, నిల్వల నిర్వహణపై అధికారుల‌కు దిశానిర్దేశం చేయ‌నున్నారు.

ఇవికూడా చ‌ద‌వండి..

హైద‌రాబాద్‌లో పెట్రోల్ బంక్‌ల వ‌ద్ద కిలోమీట‌ర్ల మేర క్యూ.. ఆటోల బంద్‌తో ఉద్యోగుల అవ‌స్థ‌లు

గ్యాస్‌ రీఫిల్‌ బుకింగ్‌ గడువు మరోసారి పెంపు.. డబుల్‌ సిలిండర్‌ ఉంటే 35 రోజులు ఆగాల్సిందే

Advertisement

తాజావార్తలు

Advertisement