త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | డీటీవో వెంక‌న్న కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | భూపాలపల్లి డీటీవో వెంకన్న మృతి ప‌ట్ల సీఎం రేవంత్ రెడ్డి త్రీవ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం భ‌రోసానిచ్చారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపి నివేదిక ఇవ్వాల‌ని జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ క‌మిష‌న‌ర్ చంద్ర‌శేఖ‌ర్ గౌడ్‌ను సీఎం ఆదేశించారు.

S

Telangana | Published On Jun 22, 2026, 12.17 pm IST

CM Revanth Reddy | డీటీవో వెంక‌న్న కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : భూపాలపల్లి డీటీవో వెంకన్న మృతి ప‌ట్ల సీఎం రేవంత్ రెడ్డి త్రీవ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం భ‌రోసానిచ్చారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపి నివేదిక ఇవ్వాల‌ని జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ క‌మిష‌న‌ర్ చంద్ర‌శేఖ‌ర్ గౌడ్‌ను సీఎం ఆదేశించారు.

వెంక‌న్న మృతిప‌ట్ల మంత్రి పొన్నం దిగ్భ్రాంతి

డీటీవో వెంకన్న మృతి పట్ల రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న భూపాలపల్లి రవాణా శాఖ కార్యాలయం వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్న సమయంలో టిప్పర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. ప్రమాద ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణకు ఆదేశించారు.
వెంకన్న మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విధినిర్వహణ‌లో మృతి చెందిన వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement