త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rythu Bharosa | కొన‌సాగుతోన్న రైతు భ‌రోసా నిధులు విడుద‌ల‌.. ఇప్ప‌టి వ‌ర‌కు 7135.77 కోట్లు జ‌మ‌

Rythu Bharosa | రాష్ట్రంలో ఖ‌రీఫ్ సీజ‌న్‌కు సంబంధించిన రైతు భ‌రోసా నిధుల విడుద‌ల కార్య‌క్ర‌మం కొన‌సాగుతూ ఉంది. ఐదో రోజు ఆరు ఎక‌రాల్లోపు రైతులంద‌రికీ రైతు భ‌రోసా నిధుల‌ను జ‌మ చేశారు.

S

Telangana | Published On Jul 4, 2026, 3.55 pm IST

Rythu Bharosa | కొన‌సాగుతోన్న రైతు భ‌రోసా నిధులు విడుద‌ల‌.. ఇప్ప‌టి వ‌ర‌కు 7135.77 కోట్లు జ‌మ‌
Advertisement

Rythu Bharosa | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో ఖ‌రీఫ్ సీజ‌న్‌కు సంబంధించిన రైతు భ‌రోసా నిధుల విడుద‌ల కార్య‌క్ర‌మం కొన‌సాగుతూ ఉంది. ఐదో రోజు ఆరు ఎక‌రాల్లోపు రైతులంద‌రికీ రైతు భ‌రోసా నిధుల‌ను జ‌మ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 67,44,468 మంది రైతుల ఖాతాల్లో రూ. 7135.77 కోట్ల నిధుల‌ను జ‌మ చేసిన‌ట్లు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ వెల్ల‌డించింది. మొత్తంగా 118.93 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు రైతు భ‌రోసా సాయం అందింది.

హైద‌రాబాద్ శిల్పా క‌ళావేదికగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భ‌రోసా నిధుల పంపిణీ విడుద‌ల జూన్ 30వ తేదీన ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. తొలి రోజు రెండు ఎక‌రాల్లోపు రైతుల‌కు, రెండో రోజు 3 ఎక‌రాల్లోపు, మూడో రోజు 4 ఎక‌రాల్లోపు, నాలుగో రోజు 5 ఎక‌రాల్లోపు, ఐదో రోజు ఆరు ఎక‌రాల్లోపు రైతుల‌కు నిధులు జ‌మ చేశారు.

Advertisement
Advertisement