త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KA Paul | కేంద్రాన్ని ప్ర‌శ్నిస్తే కేసులు పెడుతున్నారు: కేఏ పాల్‌

KA Paul | కేంద్ర‌ప్ర‌భుత్వాన్ని, ప్ర‌ధాని (PM) న‌రేంద్ర మోడీ (Narendra Modi)ని గ‌ట్టిగా ప్ర‌శ్నిస్తే కేసులు పెడుతున్నార‌ని ప్ర‌జాశాంతి పార్టీ (Praja Shanti Party) అధ్య‌క్షుడు కేఏ పాల్ (KA Paul) ఆరోపించారు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల నాయ‌కులు మాట్లాడ‌డానికి భ‌య‌ప‌డుతున్నార‌ని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

A

Telangana | Published On Jan 11, 2026, 1.58 pm IST

KA Paul | కేంద్రాన్ని ప్ర‌శ్నిస్తే కేసులు పెడుతున్నారు: కేఏ పాల్‌
Advertisement

KA Paul | కేంద్ర‌ప్ర‌భుత్వాన్ని, ప్ర‌ధాని (PM) న‌రేంద్ర మోడీ (Narendra Modi)ని గ‌ట్టిగా ప్ర‌శ్నిస్తే కేసులు పెడుతున్నార‌ని ప్ర‌జాశాంతి పార్టీ (Praja Shanti Party) అధ్య‌క్షుడు కేఏ పాల్ (KA Paul) ఆరోపించారు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల నాయ‌కులు మాట్లాడ‌డానికి భ‌య‌ప‌డుతున్నార‌ని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన హామీలను ఈ బడ్జెట్ సమావేశాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి సమావేశం నిర్వహించార‌ని, కానీ గత ఎన్నికల సమయంలో కేంద్రం తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలపై చర్చ జరగలేదని మండిప‌డ్డారు. కేంద్రం తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, దీనికోసం న్యాయస్థానాన్ని సైతం ఆశ్ర‌యించాన‌ని చెప్పారు. ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్ అప్పులు తీరుతాయని, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని అన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగాలని, అందరం కలిసి పోరాడాల‌ని సూచించారు. ప్రత్యేక హోదా వచ్చి తీరాలని, మోడీ ప్రభుత్వం ఇచ్చి తీరాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ లేదు, అక్క‌డ‌ ఉన్న రెండు పార్టీల ఎంపీలు కేంద్రానికి మద్దతే ఇస్తున్నారని పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్ లను బ్యాన్ చేయించామ‌ని, డ్రీం లెవెల్ యాప్ ను క్లోజ్ చేయించామ‌ని వివ‌రించారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞ‌ప్తి చేశారు. నాయకులు భయపడుతూ పోతే ఆంధ్రులకు న్యాయం ఎలా జరుగుతుందని ప్ర‌శ్నించారు.

తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలు కేంద్రం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరారు. కేంద్రంపై నోరు విప్పితే లోపల పెడతారు అనే టెన్షన్ నేతలకు పట్టుకుందని దుయ్య‌బ‌ట్టారు. ప్రపంచంలో డబ్బు ఎక్కువైందని, కానీ మనకు దరిద్రం ఎక్కువైందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లంద‌రికీ సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలిపారు. వేదాంత గ్రూప్ అనిల్ అగర్వాల్ కొడుకు అగ్నివేశ్‌ అగర్వాల్ న్యూయార్క్ లో చనిపోయారని, ఇది చాలా బాధాక‌ర‌మ‌న్నారు. వారి కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement